అధికారం కోసం ఇతర పార్టీలకు జంప్ చేస్తున్న ఓ నేత బీజేపీలో తిష్టవేశాడు. పాలమూరు ఎంపీ, ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక చోట తన కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజ్యసభ సీటు ఆశించగా మొండిచేయి లభించింది. తర్వాత పార్టీలో పెద్ద స్థాయి పదవి ఆశించి భంగపడ్డాడు. ఈసారి ఎలాగైనా పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉండాలని కృతనిశ్చయంతో ఉండగా.. అధిష్టానం షాక్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన డీకే అరుణను రంగంలోకి దించుతామని అధిష్టానం ప్రకటించింది. దీంతో ఖంగుతిన్న సదరు నేత తనకు టికెట్ దక్కదని మోదీ జపం చేయడం షురూ చేశాడు. మహబూబ్నగర్ నుంచి మోదీ పోటీ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నాడు. ఇలా స్టంట్ చేయాలని చూడడంతో సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత మొదలైంది. అరుణకు చెక్ పెట్టేందుకే ఈ ‘జిత్తు’లమారి జిమ్మిక్కులు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.2018లో ఎంపీ ఎన్నికల సమయంలో ప్రజలు తిరస్కరించినా.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడట. పార్టీలోని బీసీ నేతలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడన్న గుసగుసలు ఉన్నాయి.
మహబూబ్నగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాలమూరు బీజేపీ నేతలు మోదీ జపం చేస్తుండడం రాజకీ య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని న రేంద్రమోదీ మహబూబ్నగర్ నుంచి నుంచి పోటీ చే స్తారని సోషల్మీడియాలో అదే పార్టీకి చెందిన ఓ నేత ప్రచారం చేయించడం బీజేపీ వర్గాల్లో కలవరానికి గురిచేసింది. ఈసారి తనకు టికెట్ వస్తుందో లేదో అనే అ నుమానంతో ప్రచారం చేపట్టడంతో మరో వర్గం ఖంగుతిన్నది.
ఈ జిత్తుల మారి ఎత్తులపై ఆ పార్టీ నేతలే తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నారు. పాలమూరు పార్లమెంట్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్న గద్వాలకు చెందిన మ రో నేత ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తె లుస్తున్నది. కాగా, ఈ ఇద్దరు నేతలు పార్టీలు మారినోళ్లే కావడం విశేషం. 2018 ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన ఈ చెల్లని నాణేలతో ముందునుంచి పార్టీలో ఉన్న బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీలో రెడ్డిల ఆధిపత్యం ఎక్కువైందని, బీసీ నేతలను అణదొక్కుతున్నారని మండిపడుతున్నారు. దీనికి ఓ మాజీ ఎమ్మెల్యే ఉదంతమే ఉదాహరణగా చెప్పుకొంటున్నారు.
అతడిని పార్టీలో పట్టుబట్టి చేర్పించుకొని.. జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షు డు అయ్యాక.. ఆయనను అవమానించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. కాగా, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఢీకొట్టే నాయకులు కరువవడంతో కాంగ్రెస్ నేతలపై ఫోకస్ పెంచారు. దీంతో స్థానిక బీజేపీ నేతలు మేము పల్లకీ మోసేటోళ్లమే అయ్యామని ఆవేదన చెందుతున్నారు. పాలమూరు పార్లమెంట్ తెరమీద మోదీ పేరును తీసుకొచ్చి మరో నేతకు చెక్పెట్టే యత్నాలు చేస్తున్నారని స్పష్టం అవుతున్నది.
అధికారం కోసం పార్టీలు మారిన ఓ నేత బీజేపీలో సెటిల్ అయ్యారు. పార్టీ అధిష్టానం ఆయనను టిష్యూ పేపర్లాగా వాడుకుంటుండడంతో ఆవేదన చెందుతు న్నారు. తనకు ఎంపీ, కొడుకుకు ఉమ్మడి జిల్లాలో ఏదో ఓ స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పార్టీలో చేరిన వెంటనే రాజ్యసభ సీటు అడిగితే కేంద్ర బీజేపీ నేతలు మొండిచెయ్యి చూపారు. తూ తూ మంత్రంగా కార్యవర్గ సభ్యుడి పోస్టు ఇచ్చారు. చి వరకు పాలమూరు ఎంపీ స్థానం కోసం పాకులాడుతుంటే.. అధిష్టానం మాత్రం గతం లో పోటీ చేసి ఓడిపోయిన డీకే అరుణ నే రంగంలో దింపుతామని చెప్పింది.
దీంతో ఖంగుతిన్న సదరు నేత ఎంపీ టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని తెలుసుకొని.. సోషల్మీడియాలో మోదీ జపం ప్రారంభించారు. దీన్ని అడ్డం పెట్టుకొని పెద్ద స్టంట్ చేయాలని చూస్తే సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. డీకే అరుణకు చెక్ పెట్టేందుకే ఈ జిత్తుల మారి జిమిక్కులు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. మోదీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారన్న దానిపై కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు క్లారిటీ ఇవ్వలేదు. దీన్నిబట్టి తన సీటు కోసమే కొత్త నాటకానికి తెరలేపారని అర్థం అవుతున్నది. దీంతో ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య ధోరణి ప్రారంభమైందని కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు.
పాలమూరు బీజేపీలో ఆదినుంచి బీసీల హవానే కొ నసాగింది. 2019 తర్వాత సీన్ రివర్స్ అయింది. ఆధిపత్యం మొత్తం రెడ్డిల చేతుల్లోకి వెళ్లిపోవడం.. పాత నే తలకు గుర్తింపు లేకపోవడంతో చాలామంది నేతలు బీ ఆర్ఎస్లో చేరారు. టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బీసీ ప్రాబల్యం ఉన్న ఎర్రశేఖర్ బీజేపీలో చేరితే ఆయనను జిల్లా అధ్యక్షుడిగా చేశారు. అయితే, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తొలిసారిగా పాలమూరుకు వచ్చిన సమయంలో ఆయనను అవమానించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఎర్రశేఖర్ అదే రోజు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఖంగుతిన్న బీజేపీ నేతలు ఆయనను బతిమాలినా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి ఇటీవలే కాంగ్రెస్లో చేరారు.
ఇదిలా ఉండగా ఇద్దరు నేతల ఆధిపత్యంతో బండి సంజయ్ పాదయాత్ర విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి.లక్షలు ఖర్చుపెట్టినా జనం లేకపోవడంతో బం డి సంజయ్ పార్టీ నేతలపై మండిపడ్డారు. ఇటీవల బీజే పీ చేపట్టిన భరోసా యాత్ర కూడా తుస్సుమన్నది. ఈటల రాజేందర్, రఘునందన్రావు, ఇతర బీజేపీ నాయ కులకు స్థానిక నేతలు జనసమీకరణ చేయడంలో విఫ లం కావడంతో అర్థాంతరంగా యాత్ర వాయిదా వేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి జిల్లాలో పోటీ చేసేందుకు, బీఆర్ఎస్ను ఢీకొట్టేందుకు అభ్యర్థు లు లేకపోవడంతో కాంగ్రెస్ నేతలపై ఫోకస్ పెట్టారు. చివరకు మోదీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని చీప్ ట్రిక్స్ప్లే చేస్తుండడంతో పార్టీ నేతలే భగ్గుమంటున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీజేపీలో ముం దునుంచి ఉన్న నేతలను కాదని కొత్తగా వచ్చిన ఇద్ద రు నేతలదే హవా నడుస్తున్నది. 2018లో గద్వాల లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైన డీకే అరుణ పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీలో చేరా రు. ఏపీ జితేందర్రెడ్డి తన అధికారం కోసం టీడీపీ, బీజేపీల్లో చేరి.. చివరకు 2009 ఎన్నికల ముందు గు లాబీ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ పాలమూరు నుంచి పోటీ చేయగా, జితేందర్రెడ్డి చేవెళ్ల నుంచి పో టీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2018లో అసెంబ్లీ ముందస్తు ఎన్నికల వేళ బీఆర్ఎస్కు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. 2019లో పార్టీ ఎంపీ టికె ట్ నిరాకరించింది.
దీంతో మళ్లీ అధికారం కోసం చివ రి నిమిషంలో బీజేపీలో చేరారు. కానీ, ఆయనను కాదని అంతకుముందే కాంగ్రెస్ నుంచి వచ్చిన డీకే అరుణకు పార్టీ టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టింది. డీకే అరుణ ఓటమి పాలుకావడం తో తన రాజకీయ భవిష్యత్కు ఢోకా లేదని భావించి చక్రం తిప్పడానికి య త్నించారు. చివరకు ఆ ప్రయత్నాలు విఫలం కావడం తో ఆయనకు ఏ పదవి ఇవ్వకుండా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో తీవ్ర అ సంతృప్తిలో ఉండి.. డీకే అరుణకు చెక్ పెట్టేందుకు మోదీ జపం చేస్తురని కార్యకర్తలు విమర్శిస్తున్నారు.