జడ్చర్ల, డిసెంబర్ 24 : యాసంగి సాగుకు రైతన్న సమాయత్తమవుతున్నాడు. ఈ ఏ డాది వానకాలంలో వర్షా లు సమృద్ధిగా కురవడం తో చెరువులు, కుంట లు నిండుకుండలను తలపిస్తున్నాయి. వా గులు పొంగిపొర్లాయి. భూగర్భజలాలు పెరగడంతో బోర్లు, బావుల్లో నీ ళ్లు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఈసారి ఆరుతడి పంట ల కంటే వరి సాగు చేసేందుకే అన్నదాతలు మొగ్గుచూపుతున్నారు. రైతులు ఇ ప్పటికే నార్లు పోసుకుని కరిగెట్లు మొదలుపెట్టారు.
మహబూబ్నగర్ జిల్లాలో యాసంగిలో దాదాపు 1,63, 000 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేయనున్నట్లు అధికారుల అంచనా. అందులో దాదాపు 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉన్నది. వేరుశనగ 29,550, మొక్కజొన్న 3 వేలు, రాగులు 2, 500, ఆముదాలు 670, బెబ్బర్లు 350, పచ్చజొన్న 250, సన్ప్లవర్ 110 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రైతులకు కావాల్సిన ఎరువులు, వి త్తనాలు అందుబాటులో ఉంచే లా చర్యలు తీసుకుంటున్నా రు.
గతేడాది కంటే ఈ వా నకాలంలో 88,000 ఎకరాల్లో వరిసాగైంది. అయి తే, వానకాలంలో మొక్కజొన్న, పత్తి వేసిన పొలా ల్లో యాసంగిలో వరి వేసే ఆలోచన ఉన్నది. దీంతో యాసంగిలో వరి 1.25 లక్షల ఎకరాలకు పెరుగుతుందని అధికారుల అంచనా. అంటే దాదాపు 35 వేల ఎకరాల్లో అదనంగా వరి సాగయ్యే అవకాశం ఉ న్నది. యాసంగిలో వరి కంటే పత్తి సాగు చేయాలని అ ధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయినా, నీళ్లు సమృద్ధిగా ఉండడంతోపాటు ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తుండడంతో వరి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి మార్కెట్లో ధాన్యానికి మంచి ధరలు రావడం కూడా కారణంగా భావించొ చ్చు. త్వరలోనే రైతుబంధు ఖాతాల్లో జమకానున్నది. దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా తప్పనున్నాయి.
అందుబాటులో ఎరువులు, విత్తనాలు..
యాసంగిలో రైతుల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. ఈసారి వర్షాలు అధికంగా కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి, దీంతో బోర్ల కింద సాగు చేసే వారందరూ వరివైపే మొగ్గుచూపుతున్నారు. యాసంగిలో లాభదాయక పంటలైన పత్తి సాగుచేయాలని అవగాహన కల్పిస్తున్నాం. డ్రమ్సీడర్తో వరిసాగుపై రైతులకు వివరిస్తున్నాం. ఈ సారి ధాన్యానికి మంచి ధరలు ఉండడం కూడా కలిసివచ్చింది.
– వెంకటేశ్, జిల్లా వ్యవసాయ అధికారి, మహబూబ్నగర్