నాగర్కర్నూల్, ఫిబ్రవరి 23 : నీటిగుంతలో పడి బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని బొందలపల్లిలోచోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బొందలపల్లికి చెందిన ప్రవీణ్గౌడ్ (12) గురువారం రాత్రి గ్రామ శివారులో ఉన్న నీటి గుంతలో పడిమృతి చెందాడు. శుక్రవారం గమనించిన గ్రామస్తులు మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ప్రమాదశాత్తు నీటి గుంతలోపడి మృతి చెందినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.