వేకువజామున మంచు దుప్పటి కప్పుకొంటున్నది. పది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో మంచు కురుస్తూ చలి చంపేస్తోంది. ఉదయం 9గంటలు దాటినా మంచు కురుస్తూనే ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ వివిధ పనులపై వెళ్లే వారికి మాత్రం కొంత ఇబ్బందులను తెచ్చిపెడుతున్నది.
అయినప్పటికీ ఉద్యోగాలకు వెళ్లేవారు, స్కూల్ విద్యార్థులు, పేపర్ బాయ్స్, ప్రయాణికులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, గొర్రెలు కాసేవారు తప్పని పరిస్థితుల్లో అలాగే తమ పనులకు వాహనాల్లో వెళ్లే రికి మంచు కారణంగా ఎదురుగా వచ్చే వెహికిల్స్ కనిపించడం లేదు. దీంతో నెమ్మదిగా గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తున్నది.