బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమ తడాఖా చూపించాలని, ఆరు నెలలపాటు ప్రత్యేక కార్యాచరణ మేరకు అడుగులు వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జూన్ 6న సీఎం కేసీఆర్ నాగర్కర్నూల్కు రానున్న నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
– నాగర్కర్నూల్, మే 29 (నమస్తే తెలంగాణ)
నాగర్కర్నూల్, మే 29(నమస్తే తెలంగాణ) : రాష్ట్రం లో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడాలేవు.. కార్యకర్తలంతా ఉద్యమ కార్యాచరణతో అడుగులు వేస్తూ తడాఖా చూపించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్లో జూన్ 6న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్య తీరిందన్నారు. కరెంట్ సమస్యే లేదన్నారు. రైతుల పంటను కొనుగోలు చేస్తున్నామన్నారు. తొమ్మిదేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని మరోసారి సీఎం కేసీఆర్ గుర్తు చేస్తారని అన్నారు. ఈ ఆరునెలలు చాలా కీలకమన్నారు. కార్యకర్తలు, నాయకులు ఉద్యమ తడాఖా చూపించాలన్నారు. ఇల్లిల్లూ, ఊరూరూ కండువాలు వేసుకొని తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు. నిజాం హయాంలో నాగర్కర్నూల్ జిల్లాగా ఉండేదని, తిరిగి జిల్లాగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
జిల్లాకు అగ్రికల్చర్ కళాశాలను ముందుండి తీసుకొచ్చానని, మెడికల్, నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇదంతా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందన్నారు. నాగర్కర్నూల్లో జూన్ 6న సీఎం కేసీఆర్ చేతులమీదుగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ భవనం ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే సభకు లక్షలాదిగా జనం తరలిరావాలని పిలుపునిచ్చారు. ఒక్క నాగర్కర్నూల్ నియోజకవర్గంలోనే 43వేల మందికి ఆసరా పింఛన్లు, 85వేల మందికి రైతుబంధు అందుతున్నదని, 50వేలకుపైగా బీఆర్ఎస్ సభ్యులు ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేసే బాధ్యత నియోజకవర్గ పార్టీ శ్రేణులపై ఉందన్నారు. అలాగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ నాయకులు పని చేయాలన్నారు. జూన్ 3న రైతు దినోత్సవం సందర్భంగా క్లస్టర్ పరిధిలో రైతులందరినీ చైతన్యపర్చాలన్నారు.
ఎవరైనా లేనిపోని ప్రచారాలు చేస్తే ఎక్కడికక్కడే తిప్పికొట్టాలన్నా రు. ఎమ్మెల్యే మర్రి తనకంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో ని యోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. జిల్లాగా ఏర్పాటు, మినీ టాంక్బండ్, మెడికల్, నర్సింగ్ కళాశాలలు, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, అగ్రికల్చర్ బీఎస్సీ కళాశాల, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మార్కండేయ, వట్టెం రిజర్వాయర్లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ నియోజకవర్గం పై చూపిన ప్రేమ వల్లే సాధ్యమైందన్నారు. సీఎం కేసీఆర్ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవం తం చేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, గ్రం థాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంతరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కురుమయ్య, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన ఉన్నారు.