విజిలెన్స్ తనిఖీలతో సరిపెడతారా?.. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా ?
గద్వాల : జోగులాంబ జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలకు అడ్డేలేదు. కోట్ల రూపాయల సీఎంఅర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)ను మిల్లర్లు స్వాహా చేస్తున్నారు. సీఎంఆర్ అక్రమాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కేటిదొడ్డి మండలం పరిధిలోని నందిన్నె గ్రామంలో కిమిడిస్వామి రైస్ మిల్లు వ్యవహరం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఆ విషయంలో ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ అధికారులను నియమించి మూడు రోజులు పాటు రైస్ మిల్లులో విసృతంగా తనీఖి చేపట్టి మాయమైన వడ్ల విషయంలో నివేదికను తయారు చేసి రాష్ట్ర అధికారులకు పంపించినట్లు సమాచారం. మాయమైన సీఎంఆర్ వడ్ల విషయంలో పూర్తి వ్యవహరాలు వెల్లడించాలని రైస్ మిల్లు నిర్వహకులకు నోటిసులు సైతం జారీ చేసిన్నట్లు తెలిసింది. ఈ వ్యవహరంలో అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం మాయమైన వడ్ల విలువ దాదాపు 3 నుండి 6 కొట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. అయితే.. మాయమైన వడ్లను రికవరి చేయడం లేదా అందుకు సరిపడా డబ్బులు వసూలు చేయడం రెండింటిలో ఏదో ఒకటి చేసే అవకాశం ఉందని సమాచారం.
అయితే ఇలాంటి అవినీతి వ్యవహారమే అలంపూర్ పరిధిలోని ఓ రైస్ మిల్లులో చోటుచేసుకుంది. ఇక్కడ కూడా విజిలెన్స్ అధికారులు గత వారం రోజులు క్రితం తనీఖీలు నిర్వహించారు. సీఎంఆర్ వడ్ల విషయంలో భారీగా అవకతవకలు జరగినట్లు తెలిసింది. వాస్తవానికి అధికారులు ఆ మిల్లుకు 1,17,000 బ్యాగుల వడ్లు కేటాయించగా… మిల్లులో మాత్రం ప్రస్తుతం 75,000 వడ్ల బ్యాగులు మాత్రమే ఉన్నట్లు అధికారుల తనికీలో తేలింది. కేటాయించిన ధాన్యంలో 42,000 బ్యాగులు మాయం అయినట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. మాయమైన వడ్ల గురించి మిల్లు నిర్వాహకులను నిలదీయగా వారు నీళ్లు నమ్మిలి పొంతన లేని సమాధానం చెప్పారట. ఈ అవినీతి వ్యవహరం బయటకు పొక్కకుండా మిల్లు నిర్వహకుడు తన పలుకుబడిని ఉపయోగించిన్నట్లు అలంపూర్ ప్రాంతంలో పుకార్లు షికార్లుగా వినిపిస్తున్నాయి. తనీఖిలకు వచ్చిన అధికారులకు డబ్బుల కట్టలతో సరి చేసే ప్రయత్నం జరిగినట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగమంతా జరిగిన వారం రోజులకు అసలు విషయం బయటకు తెలియడంతో అధికార యాంత్రంగంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
అంత పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగినా మిల్లు యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకొక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం అలంపూర్ ప్రాంతంలో చర్యనీయాంశంగా మారింది. అయితే మిల్లులో మాయమైన 42,000 ధ్యానం బ్యాగుల విలువ దాదాపు 4 కొట్ల రూపాయలకు పైనే ఉంటుంది. ఈ స్థాయిలో ధాన్యం మాయం చేయడం జిల్లాలో పెద్ద చర్చే జరుగుతొంది. అలాగే జిల్లా కేంద్రంలో కూడా మూడు రైస్ మిల్లులో ధాన్యం లెక్కల్లో తేడాలు గుర్తించిన్నట్లు తెలిసింది. సదరు మిల్లు నిర్వహకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమ మిల్లులో తనీఖి చేసిన విషయం బయటకు పొక్కకుండా చేశారన్న అరోపణలు జిల్లాలో గుప్పుమంటున్నాయి. ఈ విషయంపై జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ వివారణ కొరగా…విజిలెన్స్ అధికారులు తనీఖి చేసిన నివేదికను నాకు పంపించ లేదని వివరించారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో ఆరా తీసి అందుకు తగ్గట్టు చర్యలు తీసుకుంటాం. ఎవరిపై ఎలాంటి అపేక్షాలు ఉండవని, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించక తప్పదని ఆయన స్ఫష్టం చేశారు. ఇందులో ఎవరికి మినహింపు ఉండదని చెప్పారు. జిల్లాలో అన్ని మిల్లులపై మరోసారి తనీఖిలు చేపడుతమాని అడిషనల్ కలెక్టర్ వెల్లడించారు.