ధరణి ఒక్కటే.. కానీ వందల భూ సమస్యలను దూరం చేసింది.. గెట్ల నుంచి వందల ఎకరాల పంచాయితీకి ఫుల్స్టాప్ పెట్టింది.. సత్వర స్లాట్ బుకింగ్.. వేగంగా భూ రిజిస్ట్రేషన్లు.. త్వరగా పాస్పుస్తకాలు చేతికి.. ఇలా ఓ మంచి ఫార్మర్ ఫ్రెండ్లీ పోర్టల్గా నిలిచింది. రైతన్నకు ధైర్యాన్నిచ్చింది. ప్రతి రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో నమోదవుతుండడంతో కర్షకులు ఎక్కడి నుంచైనా వారి భూముల వివరాలు చెక్ చేసుకోవచ్చు. ప్రతి అంగులం నిక్షిప్తం అవుతున్నది. ఈజీ ప్రక్రియతో రైతన్నకు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే కష్టం తీరింది. ఆమ్యామ్యాలకు చోటు లేకుండా పోయింది. పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండడంతో రైతు మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఇప్పటి వరకు జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం 52,375 స్లాట్స్ బుకింగ్ కాగా.. 51,514 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
గతంలో కొందరు రెవెన్యూ అధికారులు రికార్డుల్లో పట్టాదారుడికి తెలియకుండా ఇతరుల పేర భూమి మార్చడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. వాటిని సరి చేసుకోవడానికి నిత్యం తాసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. అన్నదాతల కష్టాలను తొలగించేందుకు సీఎం కేసీఆర్ 2020లో ధరణి పోర్టల్ను తీసుకొచ్చారు. దీంతో రైతులకు కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పనిలేకుండా.. ఒక్కరోజులోనే రిజిస్ట్రేషన్ చేసుకొని పట్టా పాసుపుస్తకం వచ్చేలా వెసులుబాటు కల్పించింది. ధరణిలో వెరిఫికేషన్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంతా ఆన్లైన్లో నమోదవడంతో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కలిగింది. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే హక్కు పత్రాలు చేతికొస్తున్నాయి. 15 రోజుల తర్వాత ఇంటికే పాసుబుక్ వస్తుంది. ధరణితో ఇన్ని లాభాలు ఉంటే ప్రతిపక్షాలు అవగాహన లోపంతో రైతులను అయోమయానికి గురిచేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
– గద్వాల, మే 31:
జిల్లాలో స్లాట్ బుకింగ్స్
జోగుళాంబ గద్వాల జిల్లాలో ధరణి ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 52,375మంది స్లాట్ బుకింగ్ చేసుకోగా 51,514 రిజిస్ట్రేషన్లు చేశారు. వివిధ కారణాలతో 861మంది రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
అన్నదాతకు మేలు
రైతులకు ఇబ్బందులు లేకుండా.. సులభతరంగా రిజిస్ట్రేషన్ చేయాలనే ఆలోచనతో ప్ర భుత్వం ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. గ తంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మధ్యవర్తులపై ఆధారపడేవారు. రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్లు, పట్టా పాసుపుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రైతు మీసేవలో స్లాట్ బుక్ చేసుకొని తాసీల్దార్ కార్యాలయాకి వస్తే అరగంటలో రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతోపాటు వెంటనే పేపర్పై కొనుగోలు, రిజిస్ట్రేషన్కు సం బంధించి ధ్రువపత్రాన్ని అందజేస్తారు. ధరణి ఏర్పాటుతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకం గా కొనసాగుతున్నది. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుం టాం. జిల్లాలో ఇప్పటివరకు 52,375 స్లాట్లు బుక్ కాగా 51,514 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశాం.
– వల్లూరు క్రాంతి, కలెక్టర్, గద్వాల
సులభంగా రిజిస్ట్రేషన్లు
ధరణి సేవలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మీసేవలో స్లాట్ బుక్ చేసుకున్న మరుక్షణమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకునేందుకు వీలు కల్పించింది. దీంతో భూముల కొనుగోళ్లు, అమ్మకాలు చకచకా జరిగిపోతున్నాయి. కేటీదొడ్డి మండలంలో ధరణి పోర్టల్ మొదలైనప్పటి నుంచి నేటి వరకు 2,774 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశాం. రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. నందిన్నె, కుచినెర్ల, కేటీదొడ్డి, ఇర్కిచేడు, పాతపాలెం గ్రామాలకు చెందిన భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం, భారత్మాల నేషనల్ హైవే పనులు జరుగుతున్న కారణంగా నందిన్నె, కుచినెర్ల గ్రామాల నుంచి రిజిస్ట్రేషన్లు ఎక్కువ ఉన్నాయి. మీసేవ సిబ్బంది కూడా రైతులకు, అధికారులకు అందుబాటులో ఉంటూ సహకరిస్తున్నారు.
– సుందర్రాజు, తాసీల్దార్, కేటీదొడ్డి
‘ధరణి’ శానా బాగుంది
ప్రభుత్వం తెచ్చిన ధరణితో రైతులు శానా సులభంగా సేన్లు అమ్ముకోనిక్కె.. కొనుక్కోనిక్కె వీలైంది. రిజిస్ట్రేషన్ చేసుకోనిక్కె శాన ఇబ్బంది పడేటోళ్లం. అప్పట్లో ఎవరి పొలం యాడ ఉందో తెలిసేది కాదు. అన్నీ చిక్కుముళ్లు ఉండేవి. సర్వేయర్ వచ్చి ఈ భూమి నీది అని చెప్పేదాంక తెలిసేది కాదు. ఇప్పుడు సర్వే నంబర్తో సహా సేను యాడ ఉందో తెలుస్తోంది. ఆఫీసుల సుట్టూ తిరిగే పని తప్పింది. అప్పట్ల రిజిస్ట్రేషన్ ఉందంటే 20మంది దాంక గద్వాలకు పోయి గంటలు గంటలు ఆగేవాళ్లం. అక్కడయ్యే ఖర్చు కూడా భారంగా ఉండేది. ఇప్పుడు మా మండలంలోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నరు. శానా సంతోషం.
– జంగిలప్ప, రైతు, ఇర్కిచేడు
రైతులకు భరోసా కల్పించింది
గతంలో రైతులకు సంబంధించిన భూములను రికార్డుల్లో ఇష్టారీతిలో బదలాయింపు చేశారు. ధరణి పోర్టల్ ఏర్పాటుతో రైతుల భూములకు రక్షణతోపాటు వారి భూమిని ఎవరూ మార్చుకోలేరనే భరోసా వచ్చింది. గతంలో రిజిస్ట్రేషన్ మొదలు పాస్బుక్ వచ్చే వరకు కార్యాలయాల చుట్టూ రైతులు చెప్పులు అరిగేలా తిరిగినా పని అయ్యేది కాదు. ధరణి వల్ల రైతులకు ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్ కావడంతోపాటు వెంటనే అప్డేట్ అయిన పాస్ బుక్ను కొనుగోలు చేసిన భూమితో కలిపి ఇస్తున్నారు. రైతులకు ఇంత మేలు చేస్తున్న ధరణిని ప్రతిపక్షాలు తాము రద్దుచేస్తామని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనం. రైతులకు మంచి జరగడం వారికి ఇష్టం లేనట్టుంది.
– రాముడు, జమ్మిచేడు, గద్వాల
10నిమిషాల్లో అయిపాయే..
ధరణి అద్భుతమైన రిజిస్ట్రేషన్ పద్ధతి. దీని వల్ల సమయం వృథా కాదు. పనులు వదులుకొని తిరగాల్సిన అవసరం తప్పింది. మీసేవలో స్లాట్ బుక్ చేసుకొని ఆఫీస్కు వెళ్తే 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయిపాయే. గతంల వారసత్వం కింద భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నానా తంటాలు పడేటోళ్లం. నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా.. అనుకున్న సమయానికి అందరు ఆఫీసర్లు ఉంటేనే పని అయ్యేది. ఒక్కో అధికారి వద్ద పని కావడానికి కనీసం రెండు వారాల సమయం పట్టేది. పని తొందర కావాలంటే సొమ్ము ఇవ్వాల్సిందే. అయినా సకాలంలో పని అయ్యేది కాదు. ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల ఎవరితో పని లేకుండా మీసేవలో స్లాట్ బుక్ చేసుకుంటే తాసీల్దార్ కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్ ఇచ్చినం. భూమిని నా కొడుకు, కోడలు పేర రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఒకటిన్నర రోజులో పని అయిపోయిందంటే ఆశ్చర్యమేస్తోంది. ధరణి చాలా పారదర్శకమైన పథకం.
– భీంరెడ్డి, రైతు, ధరూర్
సత్వర సేవలు అందుతున్నయ్
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అంధించిన ధరణితో సత్వర సేవలు అందుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు, అమ్మకాలు చేసుకుంటున్నాం. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వారం రోజులు అధికారులతో బాధలు పడేటోళ్లం. ఇప్పుడు దళారుల సమస్య లేకుండా సాఫీగా పనులవుతున్నయ్. వివరాలను ఆన్లైన్లోనే చూసుకునే వీలు కల్పించారు.
– పరశురాముడు, రైతు, రాజోళి
రైతులకు మేలు
గతంలో పొలం రిజిస్ట్రేషన్ చేసుకోనిక్కె ఎన్నో ఇబ్బందులకోర్చి కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. ఒక్క రోజులో రిజిస్ట్రేషన్ అయ్యిందంటే అది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. వీఆర్వోలు, దళారులు, గ్రామపెద్దలను కచ్చితంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు తీసుకెళ్లాల్సిందే. రూ.10వేలకు పైగానే ఖర్చయ్యేది. ధరణితో అన్ని సమస్యలూ తీరాయి. అమ్మకందారు, కొనుగోలుదారు, ఇద్దరు సాక్షులు ఉంటే చాలు రిజిస్ట్రేషన్ అయిపోయినట్లే. ధరణితో రికార్డులకు పూర్తి భద్రత లభిస్తున్నది. రైతుకు ఇంతకంటే ఎక్కువేం కావాలి.
– నసీరుద్దీన్, రైతు, ఇందువాసి
డబ్బుల బాధ తప్పింది
గతంలో భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డాక్యుమెంట్ రైటర్ వద్దకెళ్లి రాయించుకోవాల్సి వచ్చేది. అందుకు చార్జీలు, బాండ్ పేపర్ తదితర ఖర్చులు ఉండేవి. ధరణి వచ్చాక ఎటువంటి ఖర్చులు లేకుండా రిజిస్ట్రేషన్ ఐతుంది. తాలుకా మొత్తానికి ఒక్కటే రిజిస్ట్రేషన్ ఆఫీసు ఉంటుండే. రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ధరణి వచ్చినంక మండలానికో రిజిస్ట్రేషన్ ఆఫీసు వచ్చింది. దీంతో ఒక్క రోజులో రిజిస్ట్రేషన్ పూర్తయితుంది. ధరణి ప్రక్రియ బాగుంది.
– రఫీ, రైతు, క్యాతూర్
ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితం..
గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా దళారుల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. అడిగిన డబ్బులు ముట్టజెప్పేవాళ్లం. రైతులకు తెలియకుండానే భూమిని ఇతరుల పేర్లపై అధికారులు రికార్డుల్లో మార్చేవారు. గిప్పుడు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసి ధరణి తో మధ్యవర్తుల బెడద లేకుండా సులభం గా రిజిస్ట్రేషన్ అవుతున్నది. ఒక్కసారి రైతు వివరా లు నమోదైతే దానిని మార్చే అవకాశమే లే దు. భూములకు రక్షణ ఏర్పడింది. గుంట భూమి కూడా ఆన్లైన్లో కనిపిస్తుండడంతో రైతులు ప్రశాంతంగా ని ద్రపోతున్నారు. ఇంతటి మంచి వ్యవస్థపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. ధరణిని లేకుం డా చేస్తామంటూ మాట్లాడడం అవివేకం. ఈ సారి ఎన్నికల్లో వారికి అవకాశమిస్తే రైతులు రిజిస్ట్రేషన్ కోసం మళ్లీ అధికారులు, కా
ర్యాలయాల చుట్టూ తిరగక తప్పదు.
– కావలి నర్సింహులు, జమ్మిచేడు, గద్వాల