వనపర్తి, జూలై 22 : పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రతి చేతికి పని దొరికి గౌరవంగా బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలో తోపుడుబండ్ల హమాలీ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శనివారం మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం రూ.5లక్షల ప్రొసీడింగ్ కాపీని సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లు అని పేర్కొన్నారు. సాగునీటి రాకతో సమాజంలో మా ర్పు మొదలైందని, గడిచిన తొమ్మిదేండ్లల్లో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని, పొట్టకూటి కోసం వలసలు వెళ్లిన పరిస్థితి నుంచి మన వద్దకే వలసలు వచ్చే స్థాయికి ఎదిగామన్నారు. పొలాల్లో నాట్ల దగ్గర నుంచి రైస్మిల్లులు, కిరాణా దుకాణాల్లో కూడా ఉత్తరాది నుంచి కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్నారన్నారు. వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున షోరూంలు వెలుస్తున్నాయని, దీంతో హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లకుండా ఇక్కడే హాయిగా పని చేసుకుంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో నగరం మరింత విస్తరిస్తుందన్నారు. అనంతరం తోపుడబండ్ల సంఘం సభ్యులు మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మా ర్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీధర్, స హకార యూనియన్ సభ్యుడు మహేశ్, మార్క్ఫెడ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ విజయ్, కౌన్సిలర్లు నారాయణ, నాగన్న యాదవ్, రాములు, మాజీ కౌన్సిలర్ తిరుమల్, నాయకులు రహీం, మహేశ్, జోహెబ్, గులాంఖాదర్, శ్రీనువాసులు, తోపుడు బండ్ల సంఘం అధ్యక్షుడు బాలస్వా మి, కార్మికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లోకి..
తొమ్మిదేండ్లుగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో చేరేందుకు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. పెద్దమందడి మండలం పిల్లికుంట తండాకు చెందిన బీఆర్ఎస్ నేత కొమ్ము చె న్నయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్, తి రుపతితోపాటు వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన కావలి ఆంజనేయులు, రాణి, బాస మ న్నెం, లక్ష్మీతిరుమలయ్య, కొత్త బోయ నర్సమ్మ, వడ్డె మన్నెంకొండ, అవుసలి మహేశ్తోపాటు 50 మంది మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాణిక్యం, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మహేశ్వర్రెడ్డి, మం డల యూత్ అధ్యక్ష, కార్యదర్శులు రాము, గణేశ్ ఉన్నారు.
సింగిరెడ్డి తారకమ్మ చిత్రపటానికి నివాళి
మంత్రి నిరంజన్రెడ్డి.. తన తల్లి సింగిరెడ్డి తారకమ్మ నాలుగో వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
నియామక పత్రాల
జిల్లాలో సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద మండల కేంద్రాలకు నియమితులైన డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, ఐఈఆర్పీ కో ఆర్డినేటర్లకు శనివారం క్యాంప్ కార్యాలయంలో మంత్రి నిరంజన్రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్పవార్ నియామక పత్రాలు అందజేశారు. 10 మంది ఐఈఆర్పీ కో ఆర్డినేటర్లు, ఆరుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, నలుగురు ఎంఐఎస్ కో ఆర్డినేటర్లకు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియర్ అధికారులు యుగంధర్, శేఖర్, మహానంది, విద్యా శాఖ అధికారి శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.