మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 5 : ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరిగింది. న్యూట్రిషన్, కేసీఆర్ కిట్తోపాటు అమ్మఒడితో కాన్పులు అధికంగా జరుగుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి వేల రూ పాయలు ఖర్చు కాకుండా గర్భిణులు సర్కారు దవాఖానల్లో వైద్య సేవలకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్ర భుత్వ దవాఖానలకు క్యూ కడుతున్నారు. మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు ఆదరణ పెరిగింది. ఉమ్మడి జిల్లా నుంచి గర్భిణులు ప్రసవాల కోసం ఇక్కడికి వస్తున్నారు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో ఒకే రోజు (24 గంటల్లో) 44 ప్రసవాలు జరిగాయి. 3న గురువారం అర్ధరాత్రి 12 నుంచి 4వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పదుల సంఖ్యలో ప్రసవాలు జరిగాయి. ఇందులో 21 మందికి ఆపరేషన్లు, 23 మందికి సాధారణ ప్రసవాలు జరగగా.. 19 మంది ఆడబిడ్డలు, 25 మంది మగబిడ్డలు జన్మించారు. తల్లులు, శిశువులు క్షే మంగా ఉన్నారని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ తెలిపారు. గైనిక్ విభాగాధిపతి డాక్టర్ రాధ పర్యవేక్షణలో డాక్టర్లు లక్ష్మీపద్మప్రియ, సరిత, స్ఫూర్తి, సింధూర, ధ్రువిత, అపురూప, నాగ ప్రవళిక, జ్యోతిర్మ యి వైద్యసేవలు అందిస్తున్నారు.