వనపర్తి, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో చోరీలు.. నేరాల సంఖ్యను తగ్గించాలని రెండేండ్ల కిందట ఆగమేఘాల మీద ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు నిమ్మకుండిపోయాయి. పట్టణా లు, గ్రామాలు తేడా లేకుండా చాలా చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. ప్రధానంగా పోలీసుల ప్రోద్బలంతో ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల వ్యవస్థ పూ ర్తిగా మూలన పడడంతో ప్రజాప్రతినిధులు, కొం దరు దాతలు చేసిన సహకారమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానం అన్న సూక్తిని పలు సందర్భాల్లో పోలీసు అధికారులు వల్లించినా ఆచరణ లో సరైన పర్యవేక్షణ లేక పోవడంతో నిఘా వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది.
వనపర్తి జిల్లాలో 794 సీసీ కెమెరాలుండగా.. 397 పనిచేస్తున్నట్లు జిల్లా పోలీసు కార్యాలయంలో లెక్క ఉన్నది. అంటే మరో 397 కెమెరా లు పనిచేయడం లేదని పోలీసుల అధికారులే చె బుతున్నారు. ఇంకా దగ్గరకు వెళ్లి చూస్తే మరికొన్ని కెమెరాలు కూడా పనిచేయడం లేదని తెలుస్తున్న ది. ఇదిలా ఉంటే స్థానికంగా ఉండే పోలీసు అధికారులు వీటి ఏర్పాటులో అప్పట్లో కీలకంగా వ్యవహరించారు. ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధుల సహకారంతో భారీగా డబ్బు ల సేకరణ జరిగింది. ఇలా అనేక గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏ ర్పాటైన తొలిరోజుల్లో కొంత వరకు బాగానే పనిచేశాయి. కొన్ని చోరీలు సహితం ఈ కెమెరాల వల్ల పోలీసు అధికారులు ఛేదించగలిగారు. ప్రారంభం లో కొంత ఊరటనిచ్చినప్పటికీ పర్యవేక్షణ లేకపోవడంతో నిఘా వ్యవస్థ మూలన చేరింది. చిన్నచి న్న లోపాలతో కెమెరాలు పనిచేయడం లేదు, సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసినా పోలీసు అధికారులు వాటికి మరమ్మతులు కూడా చేయించడం లేదు. వీటిని ఏర్పాటు చేయించడంలో ఉన్న శ్రద్ధ పని చేయించడంపై దృష్టి పెట్టడం లేదని చందాలు ఇచ్చిన దాతలు, పలువురు ప్రజాప్రతినిధులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఎంతో సదుద్దేశంతో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ని ఘా వ్యవస్థ మూణ్నాళ్ల ముచ్చటగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.
మారుమూల గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంగతి అటుంచితే.. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినవి కూడా అంతంత మాత్రంగానే పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది. 63 కెమెరాల కోసం రూ.లక్షల్లో విరాళాలను సేకరించారు. అయితే నా ణ్యమైన కెమెరాలను ఏర్పాటు చేయలేదన్న విమర్శలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. అందువల్లే కెమెరాలు సక్రమంగా పనిచేయడం లేదని, తక్కు వ దూరంలోనే కెమెరాల్లో వీడియోలు నమోదు అవుతున్నట్లుగా గుర్తించారు. గ్రామాల్లోని కెమెరాలు పని చేయకపోయినా కనీసం జిల్లా కేంద్రంలోనైనా నిఘా వ్యవస్థను పటిష్టంగా అమలు చే యాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో చోరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. రోజూ ఏదో ప్రాంతంలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే కేసులు నమోదవుతుండగా, మరికొన్ని కేసుల వరకు రావ డం లేదు. పగలు.. రాత్రి తేడా లేకుండా చోరీలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని పోలీసులు ఛేదిస్తుండగా, మరికొన్ని విచారణ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. కొత్తకోట, అమరచింత, పెబ్బే రు, పాన్గల్ ప్రాంతాల్లో చోరీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇలా జిల్లాలో ఇంకా మరికొన్ని చోట్ల జరిగిన చోరీలు కేసుల నమోదు వరకు రా కుండానే వెనుతిరుగుతున్నాయి. చోరీ కేసులు నమోదైతే అక్కడి అధికారులపై అధిక ఒత్తిడి పడుతుందని, కొన్ని చోరీలను దరఖాస్తుల వరకే పరిమితం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
చోరీలు పెరుగుతున్నందున రాత్రిళ్లు పోలీసు పెట్రోలింగ్ను పెంచాలన్న అభిప్రాయం జిల్లా వ్యా ప్తంగా వ్యక్తమవుతున్నది. జిల్లా కేంద్రంలోని పోలీ సు కార్యాలయం నుంచి పెట్రోలింగ్ డ్యూటీలు నె ల ముందే ఖరారవుతాయి. రాత్రి వేళల్లో మూడు షిఫ్ట్ల వారీగా పెట్రోలింగ్ను ఏర్పాటు చేస్తారు. అ యితే ఈ వ్యవస్థ పటిష్టంగా అమలు కావడం లేదన్న విమర్శలున్నాయి. పెట్రోలింగ్ చేసే అధికారులు ప్రధాన కూడళ్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల నుంచి ఫొటోలు దిగడం వరకే ప్రాధాన్యతనిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
చిన్నంబావి మండలంలో 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్క కొప్పునూరు గ్రామంలోనే 30 కెమెరాలున్నాయి. వీటిలో 5 కెమెరాలు మాత్రమే గ్రామపంచాయతీలోని డిస్ప్లే మీద పని చేస్తున్నాయి. మిగతా 20 కెమెరాలు పని చేయడం లేదు. మరో 5 కెమెరాల ఆనవాలు కూడా డిస్ప్లేలో చూపించడం లేదు. స్థానిక అధికారులను అడిగితే 25 పనిచేస్తున్నాయి. ఐదు మాత్రమే పని చేయడం లేదని చెబుతున్నారు. వాస్తవ పరిస్థితికి, చెప్పేదానికి అసలు పొంతనే లే దు. దీనిని బట్టి జిల్లాలో పనిచేస్తున్నాయని చెబుతున్నా.. వా టిలో అనేకం పనిచేయడం లేదన్నట్లుగానే తెలుస్తున్నది.