కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ను రీ షెడ్యూల్ చేయడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ మూడో వారం నుంచి లీగ్ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. టోర్నమెంట్ మూడు వారాల పాటు జరుగుతుందని బీసీసీఐ సీనియర్ అధికారి పీటీఐకి తెలిపారు. దీంతో సెప్టెంబర్లో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్ను కూడా రద్దు చేయాలని బోర్డు నిర్ణయించింది.
ఐపీఎల్ పూర్తైన వారం లేదా 10 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది కాబట్టి సౌతాఫ్రికాతో సిరీస్ తర్వాతి తేదీల్లో మాత్రమే జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఐతే ఐపీఎల్ 2021 కొత్త షెడ్యూల్, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్పై బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.