వార్డుకు ప్రత్యేక బృందాలు
మహబూబ్నగర్టౌన్, మే9: ఇంటింటికీ చెత్త సేకరణ జరగాలి..పట్టణంలో చెత్త కనిపించొద్దు.. అంటూ బల్దియా అధికారులను ఇటీవల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించిన విషయం విదితమే. ఈమేరకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ వెంకట్రావు ప్రత్యేక దృష్టి సారించడంతో పట్టణంలో పారిశుధ్య నిర్వహణ జోరుగా సాగుతున్నది. మహబూబ్నగర్లోని అన్ని వార్డులు, ప్రధాన కూడళ్లలో చెత్త లేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికార యంత్రాంగం చర్య లు తీసుకుంటున్నది. ఆదివారం ఆయా వార్డుల్లో పారిశుధ్య సి బ్బంది పనులు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ మాట్లాడుతూ 49వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెత్తను సేకరిస్తూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామని తెలిపారు. ప్రజలు భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించి శానిటైజర్లను వినియోగించాలని, చెత్తను రోడ్లపై వేయవొద్దన్నారు.