వనపర్తి టౌన్, ఆగస్టు 24 : ‘బడీడు పిల్లలు బడిలోనే’ అనే సర్వశిక్షా అభియా న్ నినాదంతో పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్ర భుత్వం కస్తుర్బాగాంధీ పాఠశాలలను ప్రా రంభించింది. ప్రతి స్త్రీ విద్యవంతురాలైతే ఆ కుటుంబంతో సమాజం చైతన్యవంతమవుతుందని కొఠారి కమిషన్ సూచించింది. త ల్లిదండ్రులు ఉపాధి కోసం వలసలు వెళ్తే.. వారి పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయేది. అలాంటివారికి, ముఖ్యంగా బాలికలకు విద్యనందించాలని కస్తుర్భా పాఠశాలలను ఏర్పా టు చేశారు. డ్రాపౌట్లు, సెమీ ఆర్ఫన్స్, ఆర్ఫన్స్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. క్రమక్రమంగా మండలానికి ఒక్కటి చొప్పున కస్తూర్బాలను ఏర్పాటు చేశారు. పదో తరగతి వరకు ఉచిత విద్యనందిస్తూ వచ్చారు. అయితే, పదో తరగతి వరకే చదివి.. విద్యను ఆపివేసే పరిస్థితి నెలకొనడంతో ఇంటర్ విద్యను కూడా కొనసాగించేందుకు కస్తుర్భాలను అప్గ్రేడ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా వనపర్తి జిల్లాలో రెండు పాఠశాలలను అప్గ్రేడ్ చేయాలని విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ఆత్మకూర్ కేజీబీవీని జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. వనపర్తి జిల్లాలో ఉన్న 15 కేజీబీవీల్లో.. వనపర్తి, గోపాల్పేట, అమరచింతలో ఇప్పటికే ఇంటర్ విద్య ప్రారంభమైంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఒక్కో కళాశాలలో 160 మంది చదువుతున్నారు. కాగా, ఈ ఏడాది వీపనగండ్ల, ఆత్మకూర్ కేజీబీవీలను అప్గ్రేడ్ చేయాలని విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలను పంపగా.. ఆత్మకూర్ కేజీబీవీలో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులకు అనుమతిచ్చింది. దీంతో మరో 80 మందికి జూనియర్ విద్య అందే అవకాశాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా నాలుగు కళాశాలలకుగానూ 560 మంది బాలికలకు ఇంటర్ విద్య చదివే వెసులుబాటు కలిగింది. వచ్చే ఏడాది కూడా మరిన్ని కేజీబీవీలు జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉన్నది.
బాలికలు మధ్యలోనే చదువును మానేయకుం డా ఇంటర్ వరకు అన్ని మౌలిక వసతులతో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం లభించడం వారికి వరం. జిల్లాలోని రిమోట్ ఏరియాలోని వీపనగం డ్ల, ఆత్మకూర్ కేజీబీవీలను అప్గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు పంపాం. ఈ ఏడాది ఆత్మకూర్ కేజీబీవీని అప్గ్రేడ్ చేస్తూ అనుమతిలిచ్చారు. వచ్చే ఏడాది మ రిన్ని పాఠశాలలు అప్గ్రేడ్ కానున్నాయి.
– సుబ్బలక్ష్మి, బాలికల విద్యాభివృద్ధి జిల్లా అధికారిణి, వనపర్తి