పాలమూరు, జనవరి 4 : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈవో రవీందర్ తెలిపారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ప్రభుత్వం నుంచి వెలువడిందని, ఇందుకు అనుగుణంగా విద్యార్థులను సంసిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.