18 నుంచి ప్రారంభమైన టెన్త్ ఎగ్జామ్స్ శనివారం సాంఘికశాస్త్రం పరీక్షతో ముగిశాయి. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొడుతూ పరీక్షా కేంద్రాల నుంచి బయటికొచ్చారు.
ప్రశాంత వాతావరణం లో పరీక్షలు పూర్తవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా రేపటి నుంచి ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు కొనసాగనున్నాయి.
– వనపర్తి టౌన్, మార్చి 30