వెల్దండ, మార్చి 16 : రేపటినుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ జేడీ వెం కటనర్సమ్మ ఆదేశించారు. శనివారం మండల కేం ద్రం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, మో డల్ పాఠశాలలో పరీక్ష కేంద్రాలు, గదులను ఆ మె పరిశీలించారు. వసతులు, విద్యార్థుల సం ఖ్యను ఆమె క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం ఇన్వీజిలేటర్లతో మాట్లాడారు.
ఉదయం 8:50 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఇవ్వొద్దన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్ పుష్పలతకు ఆమె ఆదేశించారు. మోడల్ పాఠశాలలో కంప్యూటర్ గది, హెల్త్కేర్ గదిని ఆమె తనిఖీ చేసి పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రెండుపరీక్షా కేంద్రాల్లో మొత్తం 361మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కార్యక్రమం లో అధ్యాపకులు , సిబ్బంది పాల్గొన్నారు.
లింగాల, మార్చి 16: మండలంలో సోమవారం నుంచి జరుగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు చీఫ్ సూపరింటెండెంట్లు రాంసింగ్, నరేందర్రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. మండలంలో మొత్తం 279 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 111మంది, సాంఘిక సంక్షేమ గురుకు ల పాఠశాలలో 168 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.
ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష ఉంటుందని విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు.ఆలస్యమైతే పరీక్షా కేంద్రాలలోకి అనుమతించబడరని వారు తెలిపారు. పరీక్ష సమయంలో రెండు కేంద్రాల చూట్టు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. పరీక్ష జరిగే సమయంలో మండల కేంద్రంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని నిర్వహకులను ఆదేశించారు. ఆయన వెంట కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాగర్కర్నూల్, మార్చి 16: పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు డీఈ వో గోవిందరాజులు తెలిపారు. శనివారం ఆ యన పట్టణంలోని పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొత్తం 10,526 మంది విద్యార్థుల పరీక్ష రాయనున్నారన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 59 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉద యం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గం టల వరకు పరీక్ష జరగనుందన్నా రు. ఫిజిక్స్, బయోలజికల్ సైన్స్పరీక్ష ఉదయం 11 గంటలకు ఉంటుందన్నారు.
పరీక్ష ప్రతిరోజు ఉదయం 9:30 గంటల కు ప్రారంభం కానుండగా విద్యార్థులను ఉద యం 8:30 గంటల నుంచి 9:35 గంటల వ రకు పరీక్షా హాల్లోకి అనుమతించనున్నట్లు తెలిపారు. 9.30 గంటల వరకే సమయ ం ఉన్నా ఈ సారి 5 నిమిషా లు ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతించాలనే నిబంధనలు ఉన్నాయన్నారు. పరీక్ష కేంద్రా లు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంటనుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు కొనసాగుతాయన్నారు. కేంద్రా ల్లో సీసీ కెమెరాలు, ఫ్యాన్లు, తాగునీరు, టాయిలెట్ల సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
విద్యార్థులకు ఎదురయ్యే సందేహాలను ని వృత్తి చేసేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చే సినట్లు తెలిపారు. అందులో 24 గంటలపా టు సిబ్బంది అందుబాటులో ఉంటారని 7702775340 నెంబర్కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయవచ్చన్నారు.
పదో తరగతి విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, ఇతర కారణాలతో యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని విద్యార్థులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది కాపీయింగ్ను ప్రోత్సహించినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్పోన్లకు అనుమతి లేదని, ఎవరైనా అతిక్రమిస్తే శాశ్వతంగా ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు.