అచ్చంపేట, సెప్టెంబర్ 19 : పార్టీకోసం అంకితభావంతో పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నా రు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో అచ్చంపేట పట్టణ టీఆర్ఎస్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గువ్వల మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రామా లు, మండల కమిటీలతోపాటు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. నూతనంగా అన్ని విభాగాల్లో నియామమైన కమిటీ సభ్యులు పార్టీ కొసం బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందించేవిధంగా చూడాలని, గ్రామాలు, పల్లెల్లో సమస్యల పరిష్కారానికి చొర వ తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మరో 25ఏండ్లపాటు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంటుందన్నారు. 60లక్షల సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని తెలిపారు.
టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా రమేశ్
అచ్చంపేట పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పులిజాల రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కందికొండ శ్రీధర్, ఉపాధ్యక్షులుగా నల్లపు శ్రీనివాసులు, భారతమ్మ, పెంటయ్య, ప్రధానకార్యదర్శిగా వెంకటేశ్, ప్రచార కార్యదర్శిగా ఉస్సేన్ తదితరులను ఎన్నుకున్నారు. ఎస్సీసెల్ అధ్యక్షుడిగా పరమేశ్మాదిగ, రైతు విభాగం అధ్యక్షుడిగా బాలపీరు, ఎస్టీసెల్ అధ్యక్షుడిగా శ్రీరాంనాయక్, బీసీసెల్ అధ్యక్షుడిగా నిరంజన్, సోషల్ మీడియా ఇన్చార్జిగా విజయ్, జీబీఆర్ యువజన అధ్యక్షుడిగా మహేశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా వెంకట్స్వామి తదితర అనుబంధ విభాగాలకు పూర్తిస్థా యి కమిటీలను ఎన్నుకున్నారు.
సబ్సిడీపై స్పింక్లర్లు అందజేత
అచ్చంపేట డివిజన్లోని రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై మంజూరు చేసిన స్పింక్లర్లను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పంపిణీ చేశారు. అచ్చంపేట మండలంలో 41మంది, అమ్రాబాద్లో ఒకరికి, బల్మూర్లో 10మంది, లింగాల మండలం లో 24మంది, పదర మండలంలో ముగ్గురు రైతులకు, ఉప్పునుంతల మండలంలో 10మంది రైతులకు సబ్సిడీపై స్పింక్లర్లు అందజేశారు.
నాణ్యత పాటించాలి
పట్టణంలోని 20వ వార్డులో సీసీరోడ్డు నిర్మాణ పనులకు ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భూమిపూజ చేశారు. రోడ్డు పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. 290 మీటర్లమేర సీసీరోడ్డు నిర్మాణ పనులను రూ.30లక్షలతో చేపడుతున్నట్లు కౌన్సిలర్ రమేశ్రావు తెలిపారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, వైస్చైర్మన్ శైలజావిష్ణువర్ధన్రెడ్డి, మాజీ చైర్మన్ తులసీరాం, జెడ్పీటీసీ ప్రతాప్రెడ్డి, కౌన్సిలర్లు అం తటి శివ, గడ్డం రమేశ్, సోమ్లానాయక్, మన్ను పటేల్, తగరం శ్రీను, హార్టికల్చర్ జిల్లా అధికారి చంద్రశేఖర్రావు, ఏఈ మేఘనాథ్, తాడూర్ సర్పంచ్ కృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్రెడ్డి, ఆకుల వెంకటేశ్, కందికొండ శ్రీధర్, అమినొద్దీన్, పులిజాల రమేశ్, శ్రీనివాస్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
మండలంలోని మంగళకుంటపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే గువ్వల బాలరా జు పరామర్శించారు. అంతకుముందు వెంకట య్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యేవెంట సర్పంచ్ ప్రియాంకాగణేశ్, ఉపసర్పంచ్ సైదులు, గ్రామ కమిటీ అ ధ్యక్షుడు జంగయ్య, శ్రీహరి, పరుశరాం ఉన్నారు.