నాగర్కర్నూల్, జూలై 21(నమస్తే తెలంగాణ) : వానలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నాగర్కర్నూల్ కలెక్టర్ ఉదయ్కుమార్ సూచించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
ఈ సీజన్లో ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతుండడంతో ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. మున్సిపల్, పంచాయతీ, పోలీసు, ఇతర శాఖలన్నింటినీ అప్రమత్తం చేశామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు. ప్రతిరోజూ మురుగు కాల్వలను శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఇండ్ల మధ్య మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించాలని చెప్పామన్నారు.
పీహెచ్సీలు, సీహెచ్సీలు, పల్లె దవాఖానాల్లోనూ అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఇప్పటికే వైద్యశాఖకు ఆదేశించామన్నారు. దోమకాటుతో వచ్చే డెంగీ, మలేరియాతోపాటు కలుషిత నీటి వల్ల కలిగే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత శాఖకు సూచించామన్నారు. ప్రతి శుక్రవారం డ్రై నిర్వహిస్తున్నామని, ఇండ్లల్లోని కూలర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలన్నారు. నాలుగైదు రోజులైనా ఆరోగ్య సమస్యలు తగ్గకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. డెంగీ కేసులు వస్తే వెంటనే మెరుగైన వైద్యం అందిస్తూ పరిసరాల్లో పారిశుధ్య చర్యలు తీసుకుంటారన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, తాజా ఆహార పదార్థాలనే తినాలని సూచించారు. జిల్లాలో వరదల ప్రభావం తక్కువే, రోడ్లపై వరద పారే వెళ్లే సమయంలో ప్రవాహం తగ్గాక వెళ్లడం శ్రేయస్కరమన్నారు. ఎక్కడైనా చెరువులు, కుంటలు తెగే పరిస్థితి ఉంటే తాసీల్దార్, పోలీసులకు సమాచారం అందించాలన్నారు. రోడ్లకిరువైపులా విద్యుత్ స్తంభాల పక్కన ఉండే చెట్ల కొమ్మలను తొలగించాలని చెప్పామన్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు ఇండ్లల్లో చార్జింగ్ పెట్టేటప్పుడు, తీగలపై బట్టలు ఆరవేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. కరెంట్ స్తంభాలు 99శాతం కొత్తవే ఉన్నాయని, అయినా ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల సమీపంలోకి వెళ్లకూడదన్నారు. హాస్టళ్లు, కస్తూర్బా, గురుకులాల్లో ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పామన్నారు. తాజా కూరగాయలతో వంట చేయించడంతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచేలా ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు చర్యలు తీసుకోవాలి. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.