మక్తల్ టౌన్, ఆగస్టు 4: పిల్లలకు తల్లిపాలు శ్రీరామరక్ష అని సీడీపీవో సరోజిని అన్నారు. బుధవారం మండలంలోని కాట్రేవుపల్లిలో తల్లిపాల వారోత్సవాల సందర్బంగా అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్లతో కలిసి పిల్లల తల్లి తండ్రులకు తల్లిపాల ప్రాముఖ్యతపై తల్లులకు సీడీపీవో సరోజిని వివరించారు. అదేవిధంగా మక్తల్ పట్టణంలోని కేశవనగర్లోని కమ్యూనిటీ హాల్లో 1, 5, 11వ అంగన్వాడీ సెంటర్ల టీచర్లు కలిసి అంగన్వాడీ పిల్లల తల్లులతో మాట్లాడారు. కార్యక్రమంలో సీడీపీవో సరోజిని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం నుంచి ప్రతి పేదింటి బిడ్డలకు పోషకాహారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని తెలిపారు. ప్రతి తల్లి బిడ్డకు పాలు ఇవ్వాలని తెలిపారు. తల్లిపాల ద్వారా పిల్లలకు ఇ మ్యూనిటీ పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.
బిడ్డకు ముర్రుపాలు తాగించాలి
పుట్టిన బిడ్డకు గంటలోపు తప్పకుండా ముర్రుపాలు తాగించాలని కౌన్సిలర్ అనిత అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని 2వ వార్డులో బుధవారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. 6 నెలల వరకు తల్లిపాలు తప్ప ఇతర పదార్థాలు ఇవ్వకూడదన్నారు. తల్లిపాలలో బిడ్డకు సరిపడినంత పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయన్నారు. 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇస్తూనే అనుబంధ ఆహారం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోష కాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిపాల వారోత్సవాల్లో ఏఎన్ఎం సరస్వతి, అంగన్ వాడీ టీచర్లు రాధిక, గీత, ఆశ వర్కర్లు లక్ష్మి, శివలీల, ఆయాలు భాగ్యలక్ష్మి, మమత, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.