నారాయణపేట, ఏప్రిల్ 16 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం దక్కిందని, పదేండ్ల పాలనలో ప్రజలు, రైతులు సంతోషంగా జీవించారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అలాం టి పార్టీ అభ్యర్థులను పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. వారం రోజుల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నారాయ ణపేటలో జరిగింది. ఈ సమావేశానికి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, అంజయ్య యా దవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ అమలు కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రజలు ముందుగానే ఆలోచించి ఉంటే బీఆర్ఎస్కు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. నాటి పదేండ్ల కాలంలో ఒక్కసారైనా పొలాలు ఎండిపోలేదని, తాగు, సాగునీటికి, కరెంట్ కోసం ధర్నా లు కాలేదని గుర్తు చేశారు. కానీ రేవంత్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ సంఘటనలన్నీ పునరావృ తం అవుతున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించి..
ఇప్పుడేమో ఆగస్టు 15 వరకు చేస్తామని చెప్పడం హా స్యాస్పదమన్నారు. ఎంపీ ఎన్నికల ముందే రుణమాఫీ చేయని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ముందు చేస్తుందా..? అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాం లో అమలైన పథకాలు కావాలం టే గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఓటమి భయంతో అయి నా కాంగ్రెస్ పథకాలు అమలుకు శ్రీకారం చుడుతుందన్నారు. బీజేపీ, బీ ఆర్ఎస్ ఒక్కటికావడం అసాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వ చ్చాక భూములు ధరలు తగ్గి పోయాయని వాపోయారు. పంటలు ఎండి, పిం ఛన్లు రాక రైతులు, వృద్ధులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. సుఖాలు ఉన్నప్పుడు వెంట ఉండి కష్టాలు వచ్చినప్పుడు విడిచివెళ్లే నీచమైన సంస్కృతి మనది కాదన్నారు. కష్టాలను ఎదుర్కొని అధికారం తీసుకొచ్చే వరకు నిద్రపోమన్నారు. కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పథకాలను వివరిస్తూ.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మన్నె శ్రీనివాస్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కేసీఆర్ పేరుచిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు.
అబద్ధపు మాటలతో జనాన్ని మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నదని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లాఅధ్యక్షుడు రాజేందర్రెడ్డి ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మకై ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లు సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి అరుణ గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పేట కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపి గెలిపించిన విషయం ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేదని నిలదీశారు. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి కొందరు నాయకులు వెళ్తున్నారని, పోయేటోళ్లను ఎవరూ ఆపలేరన్నారు. మండల, గ్రామస్థాయి నాయకులు మాత్రమే పార్టీని వీడారని, కార్యకర్తలు పోలేదని చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పార్టీలోకి మళ్లీ వస్తారని, అలాంటి వారిని చేర్చుకునేది లేదని తెగేసి చెప్పారు. నాలుగున్నర ఏండ్లు పార్టీని కాపాడుకుంటామని, మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే అని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికలతోపాటు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీఆర్ఎస్ విజయఢంకా మోగించాలన్నారు.
సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డి ఎంపీ ఎన్నికల్లో ప్రజలను మళ్లీ తప్పుదోవ పట్టించేందుకు మాయల ఫకీర్ మాటలు మాట్లాడుతున్నాడని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన రూ.7,500కోట్ల ఖజానాను మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి తన్నుకుపోయి కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని ఆరోపించారు. నా రాయణపేట సభలో నా తండ్రి పేరును ప్రస్తావించి ఓట్లు అడగడం రేవంత్ దిగజారుడు తనానికి నిదర్శనమ న్నారు. డీకే అరుణ మంత్రిగా ఉన్నన్నాళ్లు ఈ ప్రాంత అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, ఆమెను గెలిపిస్తే జిల్లాలో భరతసింహారెడ్డి లిక్కర్ దం దా లు మళ్లీ మొదలవుతాయని వి మర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ బలపర్చిన మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి మన్నె శ్రీనివాస్రెడ్డి గెలుపునకు కృషి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్డ్డి సూచించారు. కేసీఆర్ దూరదృష్టితో అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి తెలంగాణను దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిపారని గుర్తు చేశారు. రేవంత్ అంతులేని హామీల భ్రమలో పడి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు ఓట్లేసి మోసపోయారన్నారు. ఆరు గ్యారెంటీల్లో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం మాత్రమే అమలు చేసి.. మిగతావి అమలు కావాలంటే రాహుల్ను ప్రధాని చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ ప్రధాని కాడు.. మిగిలిన గ్యారెంటీలు అమలు కావనే విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు వివరించాలని చెప్పారు.
బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి, రైతుబిడ్డ, స్థానికుడైన మన్నె శ్రీనివాస్రెడ్డిని ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కోరారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు. ఆయనెప్పుడూ రైతులు, ప్రజల పక్షాన పోరాటం చేసి అండగా ఉంటారు. కేసీఆర్ను తిట్టడమే సీఎం పనిగా పెట్టుకొని హామీలను నెరవేర్చకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కేంద్రం రాష్ర్టానికి ఒక్క నవోదయ, మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయలేదని, అలాంటి బీజేపీ అభ్యర్థికి ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు లేదన్నారు. సమావేశంలో నేత సలీం, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, జెడ్పీటీసీ అశోక్గౌడ్, అంజలి, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, సీనియర్ నాయకులు ఆశిరెడ్డి, చంద్రకాంత్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీల అధ్యక్షులు, కౌన్సిలర్లు, ఎం పీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.