ఆత్మకూరు, సెప్టెంబర్ 19 : 18 సంవత్సరాలు పై బడిన వారు తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని పట్టణంలో ఆదివారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కౌన్సిల్ సభ్యులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్, కమిషనర్ రమేశ్ మాట్లాడుతూ కరోనాతో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ కొవిడ్ టీకా వేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు వార్డుల్లో పర్యటిస్తూ టీకా వేసుకొని వారిపై సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, కౌన్సిల్ సభ్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తకోటలో..
కొత్తకోట, సెప్టెంబర్ 19 : పట్టణంలోని అన్ని వార్డులో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఆదివారం 13, 15వ వార్డుల్లో వ్యాక్సిన్ కేంద్రాలను డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాసులు సందర్శించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. అదేవిధంగా పదో వార్డులో కూడా వ్యాక్సిన్ కొనసాగింది. 6వ వార్డులో దివ్యాంగుడి ఇంటి వద్దకు వెళ్లి టీకాను ఆ వార్డు కౌన్సిలర్ రవీందర్రెడ్డి వేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కోఆప్షన్ సభ్యులు వహీద్, కౌన్సిలర్లు రామ్మోహన్రెడ్డి, ఖాజామైనోద్దీన్, తిరుపతయ్య, పద్మ, అయ్యన్న, అంగన్వాడీ టీచర్ చంద్రకళ, కళావతి ఉన్నారు.
907 మందికి వాక్సినేషన్
పాన్గల్, సెప్టెంబర్ 19 : మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్ర మంలో భాగంగా మొత్తం 907 మందికి కరోనా టీకాలు వే శామని పీహెచ్సీ డాక్టర్లు వంశీకృష్ణ, రాములు తెలిపారు. మండలంలోని పది వ్యాక్సినేషన్ సెంటర్లలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
ఖిల్లాఘణపురంలో..
మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా పీహెచ్సీ సెంటర్ల పరిధిలోని గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నట్లు డాక్టర్ శంకర్ తెలిపారు. ఆదివారం ఆయా గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సినేషన్పై ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ శంకర్ తెలిపారు. వ్యాక్సిన్ కేంద్రాలను డిప్యూటీ తాసిల్దార్ పరమేశ్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పాన్గల్లో..
మండలకేంద్రంతోపాటు అన్నారంతండా, జమ్మాపూర్, చింతకుంట గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆదివారం ఎంపీడీవో నాగేశ్వర్రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి రవీందర్, సర్పంచులు రంగానాయక్, అనిత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.