నర్వ, జూలై 22 : జిల్లా విద్యాశా ఖ అధికారి లియాఖత్ అలీ మండలా న్ని సందర్శించారు. మండలంలోని కేజీబీవీ, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల ను తనిఖీ చేశారు. అనంతరం ఎంఆ ర్సీ భవనంలో యూడైస్లో పొందపరచిన పాఠశాల మౌలిక వసతుల క ల్పన, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు ఇన్స్ట్రాస్ట్రక్చర్ స్టేటస్, ఐఎస్ ఐ యాప్ ద్వారా ఫొటోల అఫ్లోడ్ తదితర అంశాలను పరిశీలించారు. ఆన్లైన్ తరగతులకు విద్యార్థులు తప్పకుండా హా జరు అయ్యేలా చూడాలన్నారు. మండలంలో 26 పాఠశాలలకు గానూ, 20 పాఠశాలల సమాచారం అందుబాటులో ఉండగా మిగతా వాటి వివరాలు నేడు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్వో భానుప్రకాశ్, ఏంఈవో లక్ష్మీనారాయణ, కాంప్లెక్స్ హెచ్ఎంలు ప్రభాకర్, వెంకటేశ్లతోపాటు ఉపాధ్యాయులు, సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.
ఎమ్మార్సీ కార్యాలయం సందర్శన
ఎమ్మార్సీ కార్యాలయా న్ని జిల్లా విద్యాశాఖ అధికారి లియాఖత్ అలీ గు రువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యూడైస్ను ప రిశీలించారు. పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. పలు అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం లో మండల విద్యాధికారి అంజలి, డీఎస్వో భా నుప్రకాశ్, డాటా ఎంట్రీ ఆపరేటర్ రాఘవేందర్ నాయుడు, సీఆర్పీలు నారాయణ, శివకుమా ర్, మాసన్న, హరిప్రసాద్ పాల్గొన్నారు.
పుస్తకాలు పంపిణీ
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరిపడా పాఠ్యపుస్తకాల ను గురువారం మండల వనరుల కేంద్రంలో జి ల్లా విద్యాశాఖ ఆధికారి లియాఖత్ అలీ ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈ వో మాట్లాడుతూ ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్న దృష్ట్యా ఉపాధ్యాయులు విద్యార్థు ల ఇండ్ల వద్దకు వెళ్లి ఆన్లైన్ తరగతులు వీక్షిస్తున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలని అన్నారు. విద్యార్థ్ధులు కచ్చితంగా ఆన్లైన్ తరగతు లు వినే విధంగా చొరవ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల హాజరును ఫో న్ ద్వారా ప్రతిరోజూ ఎంఈవోకు, డీఈవోకు గానీ తెలుపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఫో రం నిర్వాహకుడు భానుప్రసాద్, ఉపాధ్యాయు లు, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.