మహబూబ్నగర్టౌన్, జూలై 11 : జిల్లా కేం ద్రంలోని శ్రీనివాసకాలనీలో నిర్మించిన పార్కు ప్రారంభానికి సిద్ధమైంది. ప్రధాన రహదారిని అనుసరించి ఉన్న ఖాళీ స్థలంలో పార్కు నిర్మాణం చేపట్టారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక దృష్టి సారించడంతో పార్కు నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యింది. సుమా రు 10,823 చదరపు గజాల స్థలం లో రూ.కోటీ 40లక్షలతో పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. పార్కులో యోగా సెంటర్, ఆంబ్రెల్లా గ్యాలరీ, సందర్శకులు కూర్చొని సేద తీరేందుకు లాన్, టాయిలెట్స్, మధ్యలో ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారిపక్కన పార్కును సుందరం గా ఏర్పాటు చేయడం పై పట్టణ ప్రజలు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఎంపీ సంతోష్కుమార్తో కలిసి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్కును ప్రారంభించనున్నారు. ఆదివారం పార్కు నిర్మాణాన్ని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. పార్కు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్వెంట మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, ఎంఈ విజయభాస్కర్రెడ్డి తదితరులు ఉన్నారు.