మహబూబ్నగర్టౌన్, జూలై 25 : గురుకుల జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు బీసీ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ లింగయ్య తెలిపారు. మొత్తం 8,348మందికిగానూ 6,602మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఇందులో జూనియర్ కళాశాలకు సంబంధించి 7,402మందికిగానూ 5,800మంది, డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి 946మందికిగానూ 802మంది పరీక్షకు హాజరయ్యారని వివరించారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఉమ్మడి జిల్లాలోని కళాశాలల్లో ప్రవేశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, పరీక్షా కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేశారు. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.