23మహబూబాబాద్ రూరల్, జూలై 22 : కలాన్ని ఆయు ధంగా మలిచి నిజాంను సైతం దిక్కరించిన మహాకవి దాశరథి కృష్ణా మాచార్యులని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు కొనియాడారు. గురువారం జిల్లా కేంద్రంలోని గ్రంథాల యంలో దాశరథి 97వ జ యంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యద ర్శి తూర్పాటి శ్రీలత, లైబ్రేరియన్ విజేందర్, రవి, విజ య్, రుద్రారపు వీరేందర్, భూలక్ష్మి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
చిన్నగూడూరులో దాశరథి జయంతి
చిన్నగూడూరు: దాశరథి కృష్ణమాచార్యుల జీవితం యువతకు ఆదర్శం కావాలని రైస్మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డీఎస్ రవిచంద్ర అన్నారు. గురువారం మండ ల కేంద్రంలో కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా ఆయా సంఘాలు, పార్టీ నాయకులు దాశరథి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తన రచనలు, కవితల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడు దాశరథి అని కొనియాడారు. ఆ మహనీయుడి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డల నాయకులు మూల మురళీధర్రెడ్డి, వల్లూ రి చెన్నారెడ్డి, వైస్ ఎంపీపీ పిల్లి వీరన్న, ఎంపీడీవో సరస్వతి, ఎస్సై విజయ్రామ్కుమార్, మండల ప్రధాన కార్యదర్శి దారాసింగ్, సర్పంచ్ మల్లయ్య, కోఆప్షన్ సభ్యుడు మోసిన్బేగ్, నాయకులు జన్నయ్య తదితరులు ఉన్నారు.