హైదరాబాద్ : చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్తోపాటు ఆయన కుటుంబాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. బాల్క సుమన్ తండ్రి, మెట్పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్క సురేష్ అనారోగ్యంతో ఇటీవల కన్నుమూశారు. కాగా ఇవాళ జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ మెట్పల్లిలో బాల్క సుమన్ కుటుంబీకులను పరామర్మించారు. మంత్రి కేటీఆర్ వెంట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ సైతం ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.