అమరావతి : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 210 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో 140 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,388కి చేరింది. 8,82,981 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 1,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 7,180 మంది మృతిచెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 44,709 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 1,44,48,650 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.