దేశంలో మతచిచ్చు రగిలించి ఓట్లు రాల్చుకునే నరేంద్రమోదీ.. మూఢనమ్మకాల గురించి, శాస్త్రీయత గురించి మాట్లాడటం మిలీనియం జోక్గా మిగిలిపోనుంది. మతం పేరుతో, దేవుడి పేరుతో దేశాన్ని అంధయుగాల్లోకి తీసుకెళ్తున్న వాళ్లు.. సాగునీటి కాల్వలతో, పచ్చటి పంటపొలాలతో తులతూగుతున్న తెలంగాణకు వచ్చి.. ‘అంధవిశ్వాసాలు’ అంటూ దీర్ఘాలు తీస్తే జనం నవ్వుకుంటున్నారు.హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలంగాణపై ఎప్పటిలాగే నోరు పారేసుకున్న మోదీ వ్యాఖ్యలపై ఇప్పటికే విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ జరిపింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢ విశ్వాసాలు పాటిస్తారంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శపై ప్రముఖ వాగ్గేయకారుడు, పల్లె కవి, గోరటి వెంకన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘నగ్నంగా తిరిగే నాగ సన్యాసులతో తల మీద తొక్కించుకునే మోదీ మూఢ నమ్మకాల గురించి మాట్లాడటం ఏమిటి? ఒక రకంగా చెప్పాలంటే.. ఇవ్వాళ దేశంలో మూఢనమ్మకాలు పునాదిగా మనుగడ సాగిస్తున్న పార్టీ బీజేపీ ఒక్కటే’ అంటూ ఆయన ధ్వజమెత్తారు.
‘దేశంలో సీత మునగని గుండం లేదు, రాముని పాద ముద్ర లేని బండ లేదు అంటరు. అటువంటి రామున్ని భారతదేశానికి కొత్తగా పరిచయం చేస్తున్నట్లు బీజేపీ, మోదీ చేసేదంతా రాజకీయాల కోసమే. ఏ విలువలూ లేని మోదీ.. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ వర్గాల కోసమే పని చేస్తున్నారు. ప్రజాస్వామ్య, సమానత్వ విలువల సమాజాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ఫాసిస్టు రాజ్యాన్ని నెలకొల్పటమే లక్ష్యంగా చేసుకున్నారు. మోదీని చైతన్యవంతమైన తెలంగాణ సమాజం అడ్డుకోవాలి’ అని గోరటి పిలుపునిస్తున్నారు.
హైదరాబాద్లో మోదీ ఒక సభలో మాట్లాడుతూ… మూఢవిశ్వాసాల గురించి ప్రస్తావించారు. దానిపై మీ స్పందన ఏమిటి?
మూఢనమ్మకాల గురించి నరేంద్రమోదీ మాట్లాడటం అంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లే. ఏది అంధవిశ్వాసం అనేది పెద్ద ప్రశ్న. అడవుల్లోని చెంచులు, గోండులు, ఆదివాసులు కూడా తమ గుడిసె ముఖాన్ని తూర్పువైపే పెట్టుకుంటరు గని పశ్చిమానికి పెట్టుకోరు. వంటపొయ్యి గుడిసెలో దక్షిణ వైపున ఉంటది. అంతెందుకు తూర్పుదిక్కు దున్నపోతు కూడా తలపెట్టి పడుకోదని పెద్దలంటరు. అంటే.. ప్రకృతి దివ్యత్వాన్ని అనుసరించి ఓ జీవన సరళి ఆచరణలో ఉన్నది. అది ఆచారంగా మారింది. ఈ రోజు పండితులు చెప్తున్న వాస్తు అనే దాన్ని చెంచులు కూడా పాటిస్తున్నరంటే.. ఏదో సదుపాయం, సౌకర్యం ఉంటుంది. అది అంధవిశ్వాసమని కొట్టిపారేయలేం. ఇలా ప్రతి దానిలో ప్రకృతిగమనం, జీవితానుభవసారం ఇమిడి ఉంటుంది. ప్రకృతి గమన సూత్రాలలోంచి, జీవితానుభవంలోంచి అనేక నమ్మకాలు రూపొందాయి. వాటిని నిరాకరించటమంటే.. ప్రజలను తక్కువ చేసి చూడటమే.
మోదీ, బీజేపీ చెబుతున్న ఒకే జాతి, ఒకే భాష అనేది దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యాన్ని, హిందీ భాషను, ఆర్యుల సంస్కృతిని రుద్దే కార్యక్రమమేనని గోరటి స్పష్టం చేశారు. దీనివల్లనే దక్షిణాది సంప్రదాయాలు వారి దృష్టిలో మూఢనమ్మకాలుగా ఉంటున్నాయన్నారు. నిజానికి, భారతదేశానికి ఆధ్యాత్మిక సంపదను పంచు తూ, సమాజ ఉద్ధరణ కోసం పాటుపడిన మహనీయులందరూ.. శంకరాచార్యుని నుంచి పోతులూరి వీరబ్రహ్మం వరకూ దక్షిణాదిన జన్మించినవారేనని తెలిపారు.
చరిత్రను ఎట్లా చూడాలి?
పాత అంతా రోత, కొత్త అంతా అభ్యుదయం, శాస్త్రీయమ ని చెప్పటం శుద్ధ తప్పు. పురాణ ఇతిహాసాల నుంచి సమా జం ఎంతో నేర్చుకున్నది. విలువలను ప్రోది చేసుకున్నది. పుక్కిటి పురాణా లంటూ తిరస్కరించటం అశాస్త్రీయమే కాదు, బాధ్యతారాహిత్యం కూడా. తరతరాల చరిత్ర ఎంతో హేతుబద్ధతతో కూడినది. చార్వా కం, లోకాయత, బౌద్ధం, జైనంతో వచ్చిన దృక్పథాలు సమాజ వికాసానికి ఎంతో తోడ్పడ్డాయి. ప్రపంచ గణిత శాస్ర్తానికి ‘సున్నా’ (0)ను అందించిన ఘనత మనది. అలాగే ఖగోళశాస్త్రం ద్వారా గ్రహ గమనాలను తద్వారా కాల గమనాన్ని తెలుసుకొని ప్రపంచానికి అందించిన చరిత మనది. కార్తులను, కాలాలను గణించి వ్యవసాయ సమాజాన్ని ఉన్నతీకరించుకున్నట్టి జీవనం మనది. కాబట్టి గతాన్నుంచి ఎప్పుడూ నేర్చుకోవాలి.
అంధవిశ్వాసాలు ప్రగతికి ఆటంకం అని మోదీ అంటున్నరు కదా..
అంధ విశ్వాసాల గురించి మోదీ మాట్లాడటమే ఒక వింత. నగ్నంగా తిరిగే నాగ సన్యాసులతో తల మీద తొక్కించుకునే మోదీ మూఢ నమ్మకాల గురించి మాట్లాడటం ఏమిటి? ఒక రకంగా చెప్పాలంటే.. ఇవ్వాళ దేశంలో మూఢ నమ్మకాలు పునాదిగా మనుగడ సాగిస్తున్న పార్టీ బీజేపీ ఒక్కటే. అంధ విశ్వాసాలతో రాజకీయం చేసే పార్టీ బీజేపీ. అయినా ఆయన అంధ విశ్వాసాలు అని అంటున్నారంటే.. దాని వెనుక వేరే లక్ష్యాలున్నాయని గుర్తించాలి. తూనీగలు లేస్తే వాన వస్తదని ప్రజలు గుర్తిస్తరు. తంగేడు పూలు విస్తృతంగా పూస్తే.. వర్షాలు ఎక్కువ ఉంటయని నమ్ముతరు. గ్రహణం రోజు పక్షుల అరుపులు ఒక సంకేతం. ఏనుగు చనిపోయే గంట ముందు తానింక తనువు చాలిస్తానన్నట్లు ఓ సంకేతం ఇస్తుందట. ఇలాంటివి ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇక్కడే ఇంకో విషయం చెబుతాను. సునామీ వచ్చే ముందు పక్షుల అరుపులతో మేల్కొన్న జంతుజాలం ఆ ప్రమాదం నుంచి బయట పడింది. వీటిని ఎలా చూడాలి, అర్థం చేసుకోవాలి? ప్రకృతి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేకపోతే మానవ వికాసం ఇలా ఉండేదే కాదు.
దక్షిణాది రాష్ర్టాలు ఉదారవాద పునాదుల మీద నడుస్తుంటే.. ఉత్తరాది నేటికీ వెనుకబడిన మత ఛాందసంలో, భూస్వామిక సంప్రదాయాల్లో ఇరుక్కుపోయిందని.. మనది ప్రజాస్వామిక, ఆచరణాత్మక సంఘజీవనం అయితే, ఉత్తరాది ప్రాంతాలది పశుపోషక, దేశదిమ్మరి జీవన విధానమని పేర్కొన్నారు.
ప్రాచీన విద్యల్లో పరుసవేది ఒకటి అంటారు.అది శాస్త్రీయమేనా?
పరుసవేది విద్య పురాతనమైనది. సిద్ధనాగార్జునుడు 7వ శతాబ్దంలో పరుసవేది ప్రక్రియను కనుగొన్నాడు. ఆ తర్వాత కాలంలో వేమన ద్వారా ఆధునిక సమాజానికి ఈ విద్య గురించి తెలిసి వచ్చింది. సిద్ధులు దీనిపై అనేక ప్రయోగాలు చేశారు. అంటే.. గుట్టలు గుట్టలుగా బంగారాన్ని తయారు చేశారని చెప్పలేం.
భూమిలో ఉన్నట్లే చెట్లలో కూడా అనేక ధాతువులు, మూలకాలుంటాయి. ఒక రకమైన మొక్కలో బంగారం ధాతువు ఎక్కువ ఉన్న దాన్ని వినియోగించి ఏ స్థాయిలోనైనా బంగారాన్ని తయారుచేసి ఉండవచ్చు. ఇది అశాస్త్రీయం కాదు. అయితే మన వాళ్లు అన్నింటినీ కొట్టిపారేయటం వల్ల తీరని నష్టం జరిగింది.
బొట్టు, గాజులు లాంటివి కూడా మూఢాచారాలనే మాట ఉంది..
మనిషి సంఘజీవి. అంతకన్నా సాంస్కృతిక జీవి. గాజుల విషయానికి వస్తే.. మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్యానికి మారే క్రమంలో జరిగిన స్త్రీ-పురుష సంఘర్షణలో రక్షణగా వచ్చినవే గాజులు. లంబాడా స్త్రీలకు ఉండే గాజులు దానికి సంకేతం. పరిణామక్రమంలో చిన్నవిగా మారినా వాటి పుట్టుక అదే. అలాగే బొట్టుకూ ఓ చరిత్ర ఉన్నది. సారవంతమైన సాంస్కృతిక జీవనమే మన భారతీయ సమాజ ఔన్నత్యానికి నిదర్శనం. మరో మాటలో చెప్పాలంటే.. ఈ సాంస్కృతిక బలం పునాదుల మీదనే మన సమాజం సంఘటితమై అనేక విపత్తులను, శతృమూకల దాడులను ఎదుర్కొని నిలిచింది, గెలిచింది.
ఇంతకూ మోదీ మాటల్లోని అంతరార్థం ఏమిటి?
లౌకిక, ప్రజాస్వామిక విలువలు పునాదిగా గల మన భారత రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని అమలు చేసే కార్యక్రమం కలిగిన పార్టీ బీజేపీ. ప్రగతి వ్యతిరేక, అంధ విశ్వాసాలను నెత్తినెత్తుకొని ఊరేగుతున్నవాడు మోదీ. నిచ్చెనమెట్ల కులవ్యవస్థను పరిరక్షిస్తూ.. ఆధిపత్య వర్గాల దోపిడీ, పీడనలు కాపాడే ఎజెండా వారిది. ఒకే జాతి, ఒకే భాష అంటూ.. తమ ఉత్తరాది ఆధిపత్యాన్ని, హిందీ భాషను, ఆర్యుల సంస్కృతిని దేశ ప్రజలందరిపై రుద్ది వారిచేత బలవంతంగా అయినా సరే, ఆమోదింపచేసుకోవటమే వారి రాజకీయ కార్యక్రమం. దీన్ని ఆది నుంచీ వ్యతిరేకిస్తూ, తిరస్కరిస్తున్న దక్షిణ భారతీయుల విశ్వాసాలు మోదీ దృష్టిలో అంధ విశ్వాసాలు. కర్ణాటకలో బసవన్నను పూజిస్తే ఉత్తరాది దృష్టిలో అంధత్వం. లింగధారణతో విభూతి రాసుకుంటే వెనుకబాటుతనం. తమకు ప్రత్యేక భాషా సంస్కృతులు ఉన్నాయనీ, దానిపై ఎవరి ఆధిపత్యం చెల్లనేరదని అంటున్న దక్షిణాది రాష్ర్టాలది మోదీ దృష్టిలో మూఢవిశ్వాసం! శిష్టులకు, బ్రాహ్మణులకు మాత్రమే విద్య అందాలన్న దానికి విరుద్ధంగా, కర్ణాటకలో అన్ని కులాలు, మతాల వారికి విద్య అందాలని సిద్ధగంగ స్వామి చెప్పింది అంధత్వం.
ఏది అంధవిశ్వాసం అనేది పెద్ద ప్రశ్న. అడవుల్లోని చెంచులు, గోండులు, ఆదివాసులు కూడా తమ గుడిసె ముఖాన్ని తూర్పువైపే పెట్టుకుంటరు గని పశ్చిమానికి పెట్టుకోరు. వంటపొయ్యి గుడిసెలో దక్షిణ వైపున ఉంటది. అంతెందుకు తూర్పుదిక్కు దున్నపోతు కూడా తలపెట్టి పడుకోదని పెద్దలంటరు. అంటే.. ప్రకృతి దివ్యత్వాన్ని అనుసరించి ఓ జీవన సరళి ఆచరణలో ఉన్నది. అది ఆచారంగా మారింది.
ఉత్తరాదికి, దక్షిణాదికి ఉన్న చరిత్ర నేపథ్యం గురించి చెప్తారా?
ఉత్తర భారతానికి, దక్షిణ భారత దేశానికీ మధ్య తిండి, బట్ట, భాషలో తేడా ఉన్నది. ఉత్తరాదిన ఏకమొత్తంగా హిందీ భాషనే లేకున్నా, గురుముఖి లిపిగా గల వివిధ భాషలున్నా, అనుసంధాన లేదా ప్రధాన భాషగా హిందీ ఉన్నది. దక్షిణాదిన ప్రాంతానికొక భాష వేల ఏండ్లుగా ప్రత్యేక సాంస్కృతిక జీవనంతో ముడిపడి ఉన్నది. తమిళం రెండు వేల ఏండ్ల నాటిదని చారిత్రక ఆధారాలున్నాయి. దాదాపుగా అన్ని దక్షిణాది భాషలూ అతి పురాతనమైనవి. అంతటా సారవంతమైన సాంస్కృతిక జీవనం ఉన్నది. అయితే, దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన జాతీయోద్యమ కాలంలో ఒక చారిత్రక, అనివార్య పరిస్థితుల్లోంచి ఉత్తరాది ప్రాధాన్యం నెలకొన్నది. అదే క్రమంగా ఆధిపత్యంగా రూపుదిద్దుకున్నది.
ఉత్తర, దక్షిణ భారతాల మధ్య సాంస్కృతిక, జీవన వైరుధ్యాలు ఎలా ఉంటాయి?
ఉత్తర, దక్షిణ భారతాల మధ్య అనేక విషయాల్లో చాలా వైరుధ్యం ఉన్నది. దీన్ని చాల మంది వైవిధ్యం అని అంటూ, తక్కువ చేసి చెప్తున్నారు. ఉదాహరణకు ఉత్తరాదిన పున్నమి మంచి రోజు అయితే, దక్షిణాదిన తమిళులకు అమావాస్య మంచి రోజు. అక్కడ రొట్టె తింటే ఇక్కడ వరి తింటరు. కట్టు, బొట్టు, సాంఘిక జీవనంలో ఉత్తరాది చాలా వరకు రాచరిక సంప్రదాయాలు, నడతలతో ఉంటే, దక్షిణాది హేతుబద్ధమైన జీవనంతో ప్రజాస్వామికంగా, సమానత్వం ప్రాతిపదికగా ఉన్నది. దక్షిణాది రాష్ర్టాలు ఉదారవాద, సంస్కరణవాద మతాచారాల పునాదుల మీద నడుస్తుంటే.. ఉత్తరాది అంతా గిడసబారిన రాచరిక సంప్రదాయాల్లో, వెనుకబడిన మత ఛాందసంలో ఇరుక్కుపోయింది. మనది ప్రజాస్వామిక, ఆచరణాత్మక సంఘజీవనం అయితే, ఉత్తరాది ప్రాంతాలది పశుపోషక, దేశదిమ్మరి జీవన విధానం.
ఈ రోజు పండితులు చెప్తున్న వాస్తు అనే దాన్ని చెంచులు కూడా పాటిస్తున్నరంటే.. ఏదో సదుపాయం, సౌకర్యం ఉంటుంది. అది అంధవిశ్వాసమని కొట్టిపారేయలేం. మోదీ చెప్పే అయోధ్య రాముడు వేరు, భద్రాద్రి రామయ్య వేరు. ఇంకా చెప్పుకోవాలంటే.. దేశంలో సీత మునగని గుండం లేదు, రాముని పాద ముద్ర లేని బండ లేదు అంటరు. నిజమే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రామ కథ ఉన్నది. మోదీ, బీజేపీ వారంటున్నట్లు.. బాబ్రీ మసీదు పునాదులు ఉన్న చోటనే రాముడు పుట్టాడని చెప్పటం రాజకీయ లబ్ధి కోసమే.
అయోధ్య వివాదం గురించి మీరేమంటారు?
దేశంలో రాముని ప్రభావం మూల మూలన ఉన్నది. అది మోదీ చెప్తున్న అయోధ్య రాముడు కాదు. మన తెలంగాణ గ్రామాల్లో బాలసంతులు చెప్పే సీతమ్మ కథ అయోధ్య రాముని కథ కాదు. సీత కేంద్రంగా సాగి, సీతమ్మకు జరిగిన అన్యాయానికి రామున్ని మన కథ ప్రశ్నిస్తుంది. మా తాత ముత్తాతల్లోనే ఐదుగురిలో ఇద్దరి పేరు రామయ్య. అంటే రామయ్య ప్రభావం ఇప్పటిది కాదు. కాకుంటే.. మోదీ చెప్పే అయోధ్య రాముడు వేరు, భద్రాద్రి రామయ్య వేరు. ఇంకా చెప్పుకోవాలంటే.. దేశంలో సీత మునగని గుండం లేదు, రాముని పాద ముద్ర లేని బండ లేదు అంటరు. నిజమే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రామ కథ ఉన్నది. మోదీ, బీజేపీ వారంటున్నట్లు.. బాబ్రీ మసీదు పునాదులు ఉన్న చోటనే రాముడు పుట్టాడని చెప్పటం రాజకీయ లబ్ధి కోసమే. అధికారం కోసం.. అయోధ్య రామున్ని వివాదం చేసి, పబ్బం గడుపుకోజూస్తున్నది బీజేపీ.
మోదీ విలువల గురించి, త్యాగపూరిత జీవనం గురించి చెప్తున్నారుగా?
అలా అంటే… హిట్లరు కూడా నైతిక విలువలున్న వాడిగా చరిత్ర చెప్తున్నది. సమాజ గమనాన్ని ఏ దిశగా నడిపిస్తున్నారనేదే ప్రధానం. ఆ అర్థంలో మోదీ త్యాగం, కష్టపడటం అంతా అదానీ లాభాల కోసమే. ఆయన నిరాడంబరత మనకు ఎరుకే. ఆయన వేసుకునే కోట్లు విలువ చేసే కోటు, పెట్టుకొనే గడియారం, పెన్ను ఎంతటి విలువగలవో ఆయన విలువలేమిటో దేశ ప్రజలు చూశారు.
మోదీ, బీజేపీ చెబుతున్న ఒకే జాతి, ఒకే భాష అనేది దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యాన్ని, హిందీ భాషను, ఆర్యుల సంస్కృతిని రుద్దే కార్యక్రమమే. దీనివల్లనే దక్షిణాది సంప్రదాయాలు వారి దృష్టిలో మూఢనమ్మకాలుగా ఉంటున్నాయి. దక్షిణ భారతంలో సంప్రదాయాలు, ఆధ్యాత్మికత నైతిక, ప్రజాస్వామిక విలువల ప్రాతిపదికన ఉంటాయి. ఇది వారికి గిట్టదు. వారిది ఛాందస భారతం. మనది అభ్యుదయ భారతం.
మోదీ ఎదుగుదల గురించి..?
ఆయన గుజరాతీ వ్యాపార వర్గాల ప్రతినిధిగా ఎంపికై గుజరాత్ నుంచి ఢిల్లీకి ఎగుమతి అయి వచ్చినవాడు. నడమంత్రపు సిరితో అడ్డదారిన, వక్రమార్గాన లాభార్జనే ధ్యేయంగా గల అదానీ, అంబానీల ప్రతినిధిగా మోదీది పక్కా కార్పొరేట్ ముఖం. వ్యాపారవర్గాల ప్రయోజనాలు తప్ప ఆయనకు ఏమీ పట్టదు. కరోనా సమయంలో వలస కూలీల గాథలు టీవీ తెరలపై చూసి కన్నీరు కార్చని భారతీయుడు లేడు. కానీ మోదీ మాత్రం ముసిముసి నవ్వుల మోముతో భారత వికాసం గురించి మాట్లాడుతాడు. ప్రజల కష్టాలు, కన్నీరు పట్టని ఇలాంటి పాలకున్ని మన దేశం ఎప్పుడూ చూడలేదు. ఆయన వికాసం, అభివృద్ధి అంటే.. అదానీ,అంబానీ అభివృద్ధే. మరో అర్థం వెతికితే ఏమీ ఉండదు.
తెలంగాణకు మోదీ వచ్చి మూఢనమ్మకాలు అంటూ మాట్లాడటం వెనుక కారణం?
బీజేపీకి తెలంగాణలో పునాది లేదు. ఇక్కడ ఏవో సమస్యలు చెప్పి రాజకీయ పునాదిని విస్తరించుకొనే అవకాశం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సాగు, తాగునీటి సమస్య తీరింది. రాష్ట్రం సస్యశ్యామలం అయ్యింది. సకల వర్గాలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కులవృత్తులు పూర్వవైభవం సంతరించుకొని గ్రామీణ జీవన ముఖచిత్రమే మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ సమస్యలు చెప్పి రాజకీయం చేయటానికి ఇంకేమీ మిగలలేదు. కాబట్టి అంధ విశ్వాసమనే మాట ఎత్తుకున్నాడు.
దళితులు, బీసీలను తమ వైపు తిప్పుకోవటం కోసం ఆరాటపడుతున్నాడు. దళితులు, ఇతర వర్గాలు ఏదో అంధకారంలో ఉన్నట్లు భ్రమ కల్పించడానికి అందమైన అబద్ధాన్ని చెబుతున్నాడు.
అంధ విశ్వాసాల గురించి మోదీ మాట్లాడటమే ఒక వింత. నగ్నంగా తిరిగే నాగ సన్యాసులతో తల మీద తొక్కించుకునే మోదీ మూఢ నమ్మకాల గురించి మాట్లాడటం ఏమిటి? ఒక రకంగా చెప్పాలంటే.. ఇవ్వాళ దేశంలో మూఢ నమ్మకాలు పునాదిగా మనుగడ సాగిస్తున్న పార్టీ బీజేపీ ఒక్కటే.
తెలంగాణ ప్రజల స్పందన ఏమిటి?
రాష్ట్ర ప్రజలకు సుదీర్ఘ పోరాట చరిత్ర ఉన్నది. నాలుగువేల మంది బలిదానాలతో నిజాం సర్కార్కు గోరీ కట్టిన చరిత్ర ఇక్కడి ప్రజలది. 1200 మంది ప్రాణత్యాగాలతో సీమాంధ్ర వలస పాలన నుంచి విముక్తి పొంది రాష్ర్టాన్ని సాధించుకున్న చరిత్ర తెలంగాణది. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములుగా ఉంటున్న మేధావివర్గం, రచయితలు, కళాకారులు.. మోదీ ఫాసిజం వల్ల ఎదురయ్యే ప్రమాదాన్ని ఎదుర్కోవటంలో కూడా ముందుండాలి. మనువాద రాజకీయ కుట్రలను తెలంగాణ ప్రజలు గర్హిస్తారు, ఓడిస్తారు.
భారత ఉపఖండాన్ని తీవ్రంగా ప్రభావితం చేసి, సమాజ గతినే మార్చిన మహనీయులు ముగ్గురూ.. రామానుజుడు, శంకరాచార్యుడు, మధ్వాచార్యుడు.. దక్షిణాదిన పుట్టిన వారే. ఆధునిక భారతంలో సాహిత్య, సంఘసంస్కరణలో దేశాన్నే ప్రభావితం చేసిన వారు దక్షిణాదివారే. వేమన, పోతులూరి వీరబ్రహ్మం, రామదాసు, రమణ మహర్షి లాంటి సాంఘిక విప్లవ కారులు వచ్చారు. చలం, శ్రీశ్రీ, గుర్రం జాషువా లాంటి సాహిత్యకారులు వచ్చారు. ఇలాంటి తీవ్రత, వైవిధ్యం, నవ చైతన్యం ఏ రంగంలోనూ ఉత్తరాదిన కనిపించదు.
బీజేపీ, మోదీ అసలు కార్యక్రమం గురించి చెప్పండి?
బీజేపీది హిందూత్వ ఆధిపత్య వాదం. మనుధర్మాన్ని నెలకొల్పేందుకు అధికారాన్ని ఆసరా చేసుకుంటున్నారు. సాంస్కృతిక, వైజ్ఞానిక విషయాలతో సమాజాన్ని ప్రభావితం చేసి తమ వైపు తిప్పుకోవాలనేది వారి ప్రయత్నం కాదు. అంతా బలప్రయోగంతోనే సాధించాలని వారు తాపత్రయపడుతున్నారు. అందులోంచే మూకదాడులు, హిజాబ్ వివాదాలు. అలాగే.. భారతదేశ చరిత్రను సాంతం వక్రీకరించి తిరగరాసేందుకు పూనుకున్నారు.
ఎన్సీఈఆర్టీలో రొమిల్లా థాపర్, బిపిన్ చంద్ర, ఇర్ఫాన్ హబీబ్ లాంటి చరిత్రకారుల పాఠ్యాంశాలను తొలగించారు. భగత్సింగ్ పాఠాన్నీ తొలగించి హెగ్డేవార్ పాఠం పెట్టారు. పాఠశాలల్లో ‘భగవద్గీత’ను తప్పనిసరి పాఠ్యాంశంగా చేరుస్తున్నారు. ఇదంతా మన కాలాన్ని మధ్యయుగాల్లోకి తీసుకెళ్లే క్రమమే. వర్ణాశ్రమ ధర్మంలోకి నెట్టివేయటమే.
మోదీ విధానాలపై ఏమనుకుంటున్నారు?
పేదవాని ముఖంలో దైవాన్ని చూడాలని స్వామి వివేకానందుడు చెప్పాడు. నిజానికి బీజేపీ మూల సిద్ధాంతకర్తలైన దీన్దయాళ్, వాజపేయి, గోవిందాచార్య లాంటివారు మతపరమైన నైతిక విలువలు, సంస్కరణలు పునాదిగా సమాజ నిర్మాణం జరగాలని ఆశించారు. పని చేశారు. మోదీ అనుసరిస్తున్నది అసలు బీజేపీ విధానాలే కాదు. మోదీకి ఏ విధమైన విలువలైనా పడదు. మతపరమైన, ధార్మిక, నైతిక విలువలు కూడా మోదీకి పడనివిగా మారిపోయాయి. ఆయనది అంతా.. తరతరాలుగా మన సమాజం ఎన్నో పోరాటాలు, త్యాగాలతో నిర్మించుకున్న ప్రజాస్వామ్య, సమానత్వ విలువల సమాజాన్ని ధ్వంసం చేసి ఫాసిస్టు రాజ్యాన్ని నెలకొల్పటం.
సాంఘిక, మతపరమైన తేడాలు ఎట్లున్నయి?
మతపరమైన సంఘజీవన విధానం, పరిణామాన్ని చూసినా దక్షిణాది కన్నా ఉత్తర భారతంనిల్వ నీరై వెనుకబడి ఉన్నది. చారిత్రకంగా చూసినా.. వేదాలను సమాజ పరిణామక్రమానికి అనుగుణంగా భాష్యీకరిస్తూ సమాజఉద్ధరణ కోసం పాటుపడిన మహనీయులు ఉత్తరాదిన ఒక్కరూ లేరు. భారత ఉపఖండాన్ని తీవ్రంగా ప్రభావితం చేసి, సమాజ గతినే మార్చిన మహనీయులు ముగ్గురూ.. రామానుజుడు,శంకరాచార్యుడు, మధ్వాచార్యుడు.. దక్షిణాదిన పుట్టిన వారే. విశిష్ట అద్వైతం, అద్వైతం, ద్వైతంలతో ఆధ్యాత్మిక, సామాజిక జీవనాన్ని నిర్వచించి, నడిపించిన మహానుభావులు వీరు. ఆధునిక భారతంలో సాహిత్య, సంఘసంస్కరణలో దేశాన్నే ప్రభావితం చేసిన వారు దక్షిణాదివారే. వేమన, పోతులూరి వీరబ్రహ్మం, రామదాసు, రమణ మహర్షి లాంటి సాంఘిక విప్లవ కారులు వచ్చారు. చలం, శ్రీశ్రీ, గుర్రం జాషువా లాంటి సాహిత్యకారులు వచ్చారు. ఇలాంటి తీవ్రత, వైవిధ్యం, నవ చైతన్యం ఏ రంగంలోనూ ఉత్తరాదిన కనిపించదు.
బీజేపీకి తెలంగాణలో పునాది లేదు. తెలంగాణ వచ్చినంక చాలా సమస్యలు తీరినై.. ఈ పరిస్థితుల్లో ఇక్కడ సమస్యలు చెప్పి రాజకీయం చేయటానికి ఇంకేమీ మిగలలేదు. కాబట్టి అంధ విశ్వాసమనే మాట ఎత్తుకున్నాడు.
తెలంగాణలో ప్రధాని మోదీ మాటల సందేశం?
చైతన్యవంతమైన తెలంగాణలోని యువత, మేధావి వర్గాలను తమ వైపు తిప్పుకొనే నాటకంలో భాగమే అంధవిశ్వాసం మాటలు. బీజేపీ, మోదీ ఇంత అభ్యుదయవాదులా! అని భ్రమించేటట్లుగా చేసే కపట నాటకం ఇది. నేడు మోదీ, బీజేపీ మాట్లాడుతున్నది నైతిక, మతపరమైన విలువలు పునాదిగా గల సమాజాన్ని నిర్మించాలని కాదు.
మనుధర్మాన్ని పునఃప్రతిష్టించటం వారి లక్ష్యం. దక్షిణ భారతంలో ఉన్న సంప్రదాయాలు, ఆధ్యాత్మికత నైతిక, ప్రజస్వామిక విలువల ప్రాతిపదికన ఉంటాయి. ఇది వారికి గిట్టదు. వారిది ఛాందస భారతం. మనది అభ్యుదయ భారతం. మనది కబీరు, అన్నమయ్య, అక్కమాంబ, త్యాగయ్య, పోతులూరి వీరబ్రహ్మం చెప్పిన అభ్యుదయ సమానత్వ హిందుత్వం.
ఇంటర్వ్యూ: ఎస్. మల్లారెడ్డి, 80966 77255