ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా సమాజాన్ని సంస్కృతితోనే సజీవంగా నిలుపుతాయి. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ ప్రధానమైనది. గృహస్త జీవితాన్ని సజావుగాను, సభ్యత గాను నడిపించగలిగిన సంస్కృతి మనకుంటే… ప్రజలు అన్ని రంగాలలో అంటే సాహిత్యం, కళలు ఆచార సంప్రదాయాలతో వ్యక్తపరచ గలుగుతారు. సమాజాన్ని సభ్యతగా నడిపేందుకు మన పూర్వీకులు మనకంటూ సంస్కృతిని ఏర్పాటు చేశారు… దాన్నే మనమూ పాటిస్తూ వస్తున్నాం! వాటిలో భాగంగా బతుకమ్మ పండగను ప్రధానంగా చెప్పుకోవచ్చు.
బతుకమ్మ ఆడే సమయంలో పాడే పాటలలో సహనం, శీలం, శాంతం మొదలైనవాటిని బోధించే మంచి లక్షణాలుండడంతో జీవితాలు సుఖంగా శాంతంగా గడిపేందుకు ఎంతగానో సహకరిస్తాయి. అందుకే రాజులు మారినా, రాజ్యాలు అంతరించిపోయినా ఈ సంస్కృతి మాత్రం కొనసాగుతూనే ఉన్నది. రాజులు రాజ్యాలు అన్నాను కాబట్టి, బతుకమ్మ పుట్టుక కాకతీయుల కాలంలో మొదలైందని మన పెద్దలు చెప్తారు. ఎలా అంటే కాకతీయుల కాలం లో తెలుగుభాషకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ, సాహి త్యం, కళలకు ప్రాధాన్యతనిచ్చారు. అవి సాంస్కృతికంగా ఎదగడానికి ఎంతో ఉపకరించింది. కాకతీయు లు రాజకీయంగా సమైక్యత సాధించేందుకు అప్పటిదాకా ఆచరించబడుతున్న జైనమతాన్ని వదిలి పెట్టి, శైవ మతాన్ని పుచ్చుకున్నా కూడా మత రాజ్యం లాగా పాలించలేదు. ప్రజలకు మద్దతునిస్తూ…. ప్రజల సహకారం పొందేందుకు ఆర్థికంగా ఎన్నో వనరులు ఏర్పాటుచేసుకున్నారు. తద్వారా ఆర్థికంగా బలం పుంజుకున్న సమాజం సాంస్కృతికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందింది. కాకతీయ యుగం సంస్కృతికి పేరుగాంచింది. చదువు వ్యక్తిత్వాన్ని, మానవతను ఇవ్వ దు… అది సంస్కృతి మాత్రమే ఇవ్వగలుగుతుంది. సంస్కృతిని అందించడం వల్ల ప్రజలలో జాతి, మత, వర్ణ వైషమ్యాలుండకుండా కాపాడుతుంది.
ఆనాటి సమాజంలో వీరశైవం, వైష్ణవం రెండూ గొప్పగా ఆచరణలో ఉండేవి. అందుకుగాను ఆయా దేవతా మూర్తులను నిలబెట్టుకునేందుకు దేవాలయ నిర్మాణాలు ఎక్కువగా జరిగి, సామాన్య జనం కూడా ఆచారాలు, వేడుకలు పాటించేవారు. అందులో భాగంగానే నవదుర్గా రూపాలుగా బతుకమ్మను తొమ్మిది రోజులు పూజించడమనే ఆచారం ఆనాడే మొదలైంది. బతుకమ్మను ప్రకృతి ఆరాధనగా పాటపాడుతూ పూజిస్తారు.
పాట : ఒక్కొక్క పువ్వేసి చందమామ
ఒక్క ఝాము ఆయె చందమామ?
శివుడేలరాడాయె?చందమామ
శివపూజ వేళాయె చందమామ?
ఇలా 12 జాముల దాకా పాడతారు.
వేలవేల సంవత్సరాల భారత దేశ చరిత్ర పరిశీలిస్తే మన ప్రతి ఆచారం వెనుక పర్యావరణ రక్షణ, కుటుంబ పరిరక్షణ, సాంఘిక మర్యాదలకు పెద్దపీట వేసింది. మానవ ఆరోగ్యానికి- నేల సౌభాగ్యానికి మధ్య అవినాభావ సంబంధం ఉందనీ, ప్రకృతితో సామరస్యంగా జీవించాలని ఈ పూల బతుకమ్మ వేల ఏండ్లనాడే నిరూపించింది. అందుకే మనం పంచభూతాలనూ గౌరవించుకొని, కాలుష్యం అంటించకుండా కాపాడుకోవాలని బోధ చేస్తుందీ పండుగ. పెద్దల ఆశయాన్ని కొనసాగిస్తూ… బతుకమ్మ పండుగను మన ఆచారాల ప్రకారం ఆచరించుకొని ప్రకృతిని గౌరవించి, ఆయురారాగ్యాలతో ఆనందంగా ఉందాం!!
(అక్షరయాన్ సౌజన్యంతో)
స్మారక సంచిక ఆవిష్కరణ
వేద సాయిచంద్ యాదిలో జయంతి పత్రిక ప్రచురించిన స్మారక సంచికను ఆగస్టు 7న రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు ఆవిష్కరిస్తారు.వెలిచాల కొండలరావు, దేశపతి శ్రీనివాస్, రజనీ సాయిచంద్, మామిడి హరికృష్ణ, కె.యాదగిరి, కోయి కోటేశ్వరరావు, యశ్ పాల్, ఎర్రోజు శ్రీనివాస్ పాల్గొంటారు.
-విశ్వనాథ సాహిత్య పీఠం
సాహిత్య పోటీలు
విశాలాక్షి సాహిత్య మాసపత్రిక కథలు, మి నీ కథలు, కవితల పోటీ నిర్వహిస్తున్నది. మూ డు విభాగాల్లోనూ విజేతలకు నగదు బహు మతులు అందజేస్తారు. ఆగస్టు 19 లోపు రచన లు పంపాలి. చిరునామా: విశాలాక్షి సాహి త్య మాసపత్రిక, 27-5-487, పద్మావతి నగ ర్, బాలాజీనగర్,నెల్లూరు-524002. వివరాలకు 8008562742 నందు సంప్రదించగలరు.
– ఈతకోట సుబ్బారావు, సంపాదకులు
– రంగరాజు పద్మజ