బోథ్, ఏప్రిల్ 22: మండల కేంద్రంలో చేపట్టిన స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. గురువారం వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. కర్ఫ్యూలో భాగంగా సీఐ నైలు, ఎస్ఐ రాజు బోథ్తో పాటు సొనాల గ్రామాల్లో రాత్రి సమయంలో తిరుగుతూ పర్యవేక్షిస్తున్నారు.
నేరడిగొండ, ఏప్రిల్ 22: కరోనా కేసులు పెరుగుతుండడంతో మండల కేంద్రంలో వాణిజ్య, వ్యాపార సంస్థల యజమానులు బంద్ పాటిస్తున్నారు. అత్యవసర సేవలు తప్పా, మిగతావి మూసి ఉండడంతో వ్యాపార సముదాయాలు వెలవెలబోతున్నాయి.
ఉట్నూర్, ఏప్రిల్ 22: మండల కేంద్రంలో కరోనా విజృభిస్తుండడంతో పోలీసులు, గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు వ్యాపారులతో సమావేశం నిర్వహించి స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చారు. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచాలని పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మహేశ్ సూచించారు. తర్వాత దుకాణం తెరిచి ఉంటే రూ.1000 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.
బేల, ఏప్రిల్ 22: మండల కేంద్రంలో వ్యాపారులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచుతున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసు, రెవెన్యూ సిబ్బంది జరిమానా విధిస్తున్నారు. కొవిడ్ నిబంధనలపై సర్పంచ్ ఇంద్రశేఖర్ అవగాహన కల్పిస్తున్నారు.
భీంపూర్, ఏప్రిల్ 22: భీంపూర్, కరంజి(టీ) గ్రామాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. అనవసరంగా ఎవ్వరూ బయటకు రావద్దని సర్పంచ్లు జీ స్వాతిక, మడావి లింబాజీ సూచించారు.
ఇచ్చోడ, ఏప్రిల్ 22: సిరిచెల్మ గ్రామంలో రెండో రోజు గురువారం స్వచ్ఛంద లాక్డౌన్ పాటించారు. ఉదయం నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి దుకాణాలను రెండు గంటల పాటు తెరిచి ఉంచడానికి అనుమతిచ్చారు. దుకాణాలు మూసివేయడంతో జన సంచారం లేక ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది.