భూ గర్భంలో గుట్టలుగా బయటపడ్డ ప్యాకెట్లు
మూడు ట్రాక్టర్లలో పోలీస్స్టేషన్కు తరలింపు
మరిన్ని ప్రాంతాల్లో నిల్వలు
కొనసాగుతున్న సోదాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ)/కాగజ్నగర్ రూరల్/దహెగాం : కాగజ్నగర్ కేంద్రంగా కొందరు వ్యాపారులు అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు గ్రామాలకు దూరంగా, పాడుబడ్డ ఇండ్లు, గోదాముల్లో గుట్కాలను నిల్వ చేసేవారు. కానీ ఇప్పు డు ఇటుక బట్టీల్లో తవ్విన గుంతల్లో వాటిని దాచిపెడుతున్నారు. గురువారం కాగజ్నగర్ మండ లం చింతగూడ గ్రామ శివారులోని ఇటుక బట్టీల్లో ఏర్పాటు చేసిన గుంతల్లో భారీ గుట్కా డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపుతున్నది. ఇంత పెద్ద మొత్తంలో గుట్కాలు పట్టుబడడం ఇదే మొదటిసారి.
ఇటుకబట్టీనే.. అడ్డాగా..
చింతగూడ రైల్వేగేటు ప్రాంతం ఇటుకలు త యారు చేసే కూలీలతో ఎప్పుడూ సందడిగా ఉం టుంది. వర్షాకాలం కావడంతో ఆ ప్రాంతం లో కూలీల సందడి కొంత తగ్గింది. దీంతో ఇదే సరైన అడ్డాగా భావించిన కొందరు వ్యాపారులు ఇటుక బట్టీల్లో భూమికి సమాంతరంగా తవ్వి, అందు లో ఓ లారీ లోడ్ గుట్కా ప్యాకెట్లను దాచి పెట్టా రు. విశ్వసనీయ సమాచారం మేరకు కాగజ్నగర్ ఏఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గుట్టగుట్టలుగా బయటపడ్డ గు ట్కా సంచులను చూసి పోలీసులే విస్తుపోయారు. మూడు ట్రాక్టర్లలో పోలీస్స్టేషన్కు తరలించారు. పట్టుబడ్డ గుట్కా విలువ రూ. కోటీకి పైగా ఉం టుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలియజేస్తామని ఏఎస్పీ బాలరాజు తెలిపారు. కాగా, కాగజ్నగర్ రైల్వే పరిసరాల్లో ఇ లాంటి డంపులు మరిన్ని ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సమాచారం సేకరిస్తుస్తూ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దహెగాం మండలం ఇట్యాల పంచాయతీ పరిధిలోని గొర్రెగుట్టలోనూ సుమారు రూ. 25 లక్షల విలువైన గుట్కా(30 బ్యాగులు)ను స్వాధీనం చేసుకున్నారు.