ఇంద్రవెల్లి/ఆదిలాబాద్ : కరోనా మహమ్మారి వెళ్లిపోవాలని ఇంద్రవెల్లి మండలం ముత్నుర్ గ్రామంలో గ్రామ పటేల్ హాచ్ కే జంగు ఆధ్వర్యంలో మహిళలందరూ గ్రామంలోని ఆలయాల్లో దేవతలకు జలంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పటేల్ హాచ్ కే జంగు మాట్లాడుతూ.. గ్రామ దేవతలు ఆశీర్వాదంతో ఎవరు కరోనా బారిన పడకుండా సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ తుంరం బాగుబాయి, ఉప సర్పంచ్ కేంద్రే బాలాజీ, తుంరం మారుతి, జైస్వాల్ మనోజ్ కుమార్, జైస్వాల్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు