భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ శాఖల జిల్లా అధికారులకు బదిలీలు జరిగిన విషయం విదితమే. ఈ క్రమంలో ఖమ్మం జడ్పీ డిప్యూటీ సీఈవోగా పని చేస్తున్న చంద్రశేఖర్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్కు బదిలీ చేశారు. బుధవారం బాధ్యతలు చేపట్టిన ఆయన జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు