మధిర: మధిర పట్టణంలోని శ్రీమృత్యుంజయస్వామి ఆలయం వద్ద వైరానది, మధిర పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల్ కమలరాజు పరిశీలించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిరంతరం ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అండగా ఉంటారని చెప్పారు. అధికారులు ఎప్పకటిప్పుడు వరద ఉదృతిని గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. వరద ఉదృతి ఎక్కువగా ఉన్న చోట ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.