చింతకాని : దేశంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని, దళితబంధుతో దళితుల జీవితాల్లో అనూహ్య మార్పులు జరగనున్నాయని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో లచ్చగూడెం గ్రామంలో సర్పంచ్ గురజాల ఝాన్సీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన దళితబంధు కృతజ్ఞతా సమావేశంలో ప్రత్యేక అతిధులుగా పాల్గొని మాట్లాడారు. ముందుగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి దళితులంతా హరతి ఇచ్చి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 14ఏండ్ల పాటు పోరాడి సాధించుకోన్న తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ది అజెండాలుగా ముందుకెళ్తున్న తరుణంలో దళితుల అభ్యున్నతి కోరకు దళితబంధు పథకం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టడమే కాకుండా ఆచరణలో అమలు చేస్తున్నారని తెలిపారు. 75 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి చేయని పని సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారని వారు కోనియాడారు. దశాబ్ధాలు గడచినా మారని దళితుల తలరాతలు… సీఎం కేసీఆర్ పాలనలో దళితబంధు పథకం ద్వారా మారనున్నాయని తెలిపారు.
దళితుల సాధికారిత సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, దేశానికే దిక్సూచిలా దళితబంధు కార్యక్రమం నిలువనున్నదని కమల్ రాజ్ అన్నారు. ఈ సందర్భంగా గ్రామ టీఆర్ఎస్ పార్టీ, దళితసంఘాల ఆధ్వర్యంలో స్వీట్లు మిఠాయిలు పంచి, బాణాసంచా కాల్చి డప్పువాయిద్యాల నడుమ సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళహారతులిస్తూ జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గురజాల ఝాన్సీ, వైస్ఎంపీపీ గురజాల హనుమంతరావు, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పర్చగాని తిరుపతికిశోర్, నాయకులు తాతా ప్రసాద్, కిలారు మనోహర్, మంకెన రమేశ్, నల్లమోతు శేషగిరి ముఖ్య కార్యకర్తలు, దళితసంఘాల నాయకులు పాల్గొన్నారు.