కొణిజర్ల: పల్లెల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో కొండపల్లి శ్రీరామ్ సూచించారు. ప్రైడే- డ్రైడే కార్యక్రమంలో మండలంలోని సింగరాయపాలెంలో శుక్రవారం పర్యటించిన ఆయన పాతబావులు, ఇంటి పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాల తదితర ప్రాంతాలను పరిశీలించారు. అంటు వ్యాధుల పట్ల ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, విధిగా పారిశుధ్య పనులు నిర్వహించాలని, ఎక్కువ కాలంగా నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, పాతటైర్లు, గాబుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దొడ్డపునేని జ్యోతి, ఎంపీడీవో ఆర్.రమాదేవి, ఎంపీటీసీ అనుమోలు కృష్ణార్జునరావు, పంచాయతీ కార్యదర్శి ఎస్.రామకృష్ణ, అంగన్వాడీలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.