బోనకల్లు: ఖమ్మం వెంకటరమణ ఆటో మొబైల్స్ ట్రాక్టర్ షోరూం ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కిడ్రాలో బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన రైతు గుర్రం నాగయ్యవిజేతగా నిలిచారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చేతుల మీదుగా ట్రాక్టర్ ట్రక్ను అందజేశారు. మహేంద్రా ట్రాక్టర్ షోరూం నిర్వాహకులు ప్రతి 20 ట్రాక్టర్లు కొన్న రైతులకు ట్రక్కును ఉచితంగా అందించడం కోసం 20 మంది రైతుల పేర్లలో ఒక రైతు పేరును లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి విజేతలకు రూ.1.50 లక్షలు విలువ చేసే ట్రక్కును విజేత అప్పగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో రైతులకు ట్రాక్టర్లు లేనిదే వ్యవసాయం చేసే పరిస్థితి లేదన్నారు. అనంతరం రైతులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర షోరూం సేల్స్ జనరల్ మేనేజర్ హుస్సేన్చౌదరి, మేనేజర్ వీరేంద్రకుమార్, మండల రైతు కన్వీనర్ వేమూరి ప్రసాద్, ఎంపీపీ కంకనాల సౌభాగ్యం, సర్పంచ్ నోముల వెంకటనర్సయ్య, గ్రామరైతుకన్వీనర్ కంచర్ల అచ్చయ్య, టీఆర్ఎస్ మండల నాయకులు చేబ్రోలు మల్లికార్జునరావు, బంధం శ్రీనివాసరావు, బాణోతు కొండ, కన్నేటి సురేష్, పాపినేని కృష్ణ, దుంపల సురేందర్, సాదినేని శ్రీనివాసరావు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.