మధిర: జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సోమవారం మధిర మున్సిపాలిటీ పరిధిలో పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 22వ వార్డులో స్టేషన్రోడ్డు బాలాజీనగర్లో రూ.6 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీరోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. పోలీస్స్టేషన్ క్వార్టర్స్ రోడ్డులో రూ.4 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీరోడ్డుకు శంకుస్థాపన చేశారు. 20వ వార్డులో ఎస్ఎఫ్ఐ స్కూల్రోడ్డులో లక్ష రూపాయలతో నిర్మించనున్న కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, కౌన్సిలర్లు ముత్తవరపు రాణి, కట్టా గాంధీ, సయ్యద్ ఇక్బాల్, అప్పారావు, సొసైటీ చైర్మన్ బిక్కి ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.