ఖమ్మం/ కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మహాలక్ష్మి’ పథకం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శనివారం ప్రారంభమైంది. ఈ రెండు జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లలో ఆయా జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక జెండాలు ఊపి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. విద్యార్థినులు, మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని, వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతమున్న లెకల ప్రకారం ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలో ప్రతిరోజూ 40 వేల నుంచి 50 వేల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని అన్నారు. మహాలక్ష్మి పథకంతో ఈ సంఖ్య పెరుగుతుందని అన్నారు. ఆర్టీసీ ఆర్ఎం సీహెచ్ వెంకన్న మాట్లాడుతూ.. వారం తరువాత జీరో వ్యాల్యుయేషన్ టికెట్లు ఇస్తామన్నారు. వివిధ శాఖల అధికారులు కిషన్రావు, విద్యాచందన, సుమ, శ్రీనివాసరావు, పవిత్ర, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
మహిళలు సద్వినియోగం చేసుకోండి
రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల సూచించారు. రామవరంలోని మాతా, శిశు సంక్షేమ కేంద్రంలో ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం కలెక్టర్, మహిళా వైద్యాధికారులు, సిబ్బంది కలిసి రామవరం నుంచి బస్సులో ప్రయాణించి కొత్తగూడెం బస్టాండ్కు చేరుకున్నారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆధార్కార్డుగానీ, మరేదైనా గుర్తింపుగానీ చూపించి ప్రయాణించవచ్చునని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కంచర్ల చంద్రశేఖర్రావు, కాపు సీతాలక్ష్మి, శిరీష, కుమారస్వామి, భవానీ ప్రసాద్, బాణాల వెంకటేశ్వరరావు, మోరె రూప, మునిగడప పద్మ, కంచర్ల జమలయ్య తదితరులు పాల్గొన్నారు.