కొత్తగూడెం టౌన్, మార్చి 19 : ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవోస్) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో మంగళవారం రాత్రి జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు కుటుంబ, ఉద్యోగ వ్యవహారాల్లో సహకరించి.. వారి సమస్యలను అర్థం చేసుకొని కుటుంబ సభ్యులు ముందుకు సాగాలని కోరారు. జిల్లా అధికారుల్లో సగభాగం మహిళలు ఉండడం మంచి పరిణామమన్నారు.
జిల్లాలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వారందరి సహకారంతో జిల్లా అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. పాలనాధికారిగా జిల్లాను ముందుకు నడిపించడం పట్ల కలెక్టర్ ప్రియాంక ఆలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కాగా.. జిల్లాకు తొలిసారిగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావును టీజీవోస్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సంగం వెంకటపుల్లయ్య, డాక్టర్ విజయ్కుమార్, వెంకటేశ్వర్లు, దస్రూ, అబ్రహం, తిరుపతి, కనకదుర్గ, దుర్గమ్మ, రుక్మిణీదేవి, విజేత, తిరుమలేశ్, శ్రీనివాస్, ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.