ఖమ్మం: వేగంగా వచ్చిన ఓ లారీ స్కూటర్ను ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన ఖమ్మం పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైరా పట్టణంలోని ఎల్పీజీ ఔట్లెట్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు విధులకు హాజరయ్యేందుకు స్యూటర్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరి బైక్ను ఎదురుగా వస్తున్న లారీ వారీ వాహనాన్ని ఢీకొట్టడంతో మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా ప్రాంతానికి చెందిన సుకన్య (30)అక్కడికక్కడే మృతి చెందింది.
గాయపడిన మరో మహిళ నునావత్ రాణిని చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. నగరంలోని టేకులపల్లి వంతెన వద్ద స్కూటర్ను ఢీకొన్న లారీ కారును కూడా ఢీకొట్టింది. సుకన్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై ఖమ్మం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.