ఖమ్మం రూరల్, ఏప్రిల్ 14 : భర్త వేధింపులకు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండకు చెందిన పద్మ (26)కు కొన్నేళ్ల క్రితం కూసుమంచి మండలం గైగొళ్లపల్లికి చెందిన జిల్లా విజయ్కుమార్తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు.
విజయ్కుమార్ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్గా ఖమ్మం రూరల్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. భర్త కొద్దిరోజుల నుంచి భార్యను అనుమానించి వేధిస్తున్నాడు. ఈ విషయంపై గతంలో పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. అయినప్పటికీ భర్త తిరిగి వేధింపులకు పాల్పడుతున్నాడు. వేధింపులకు తాళలేని భార్య శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.