బెల్లంపల్లి, నవంబర్ 21: సీఎం కేసీఆర్తోనే సింగరేణి సంస్థకు మనుగడ ఉంటుందని బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ స్పష్టం చేశారు. శాంతిఖని గని ఆవరణలో టీబీజీకేఎస్ గని పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన గేట్ మీటింగ్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గ చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్, సీపీఐ అనుబంధ సింగరేణి గుర్తింపు సంఘాలు కార్మికులకు ఉన్న హక్కులు పోగోట్టాయే తప్పా కొత్తగా ఏమీ సాధించలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని వెల్లడించారు. అప్పటి సంఘాలు పోగొట్టిన డిపెండెంట్ ఉద్యోగాలను తిరిగి కారుణ్య నియామకాలతో తీసుకువచ్చిన ఘనత కేవలం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు కాపాడుకున్న సింగరేణి ఇక ముందు కూడా నిలువాలంటే మరోసారి సీఎంగా కేసీఆరే ఉండాలన్నారు.
సింగరేణిలో బొగ్గు బ్లాక్లను ఇటీవల బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్పరం చేయాలని చూస్తే కేసీఆర్ అడ్డుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో మరే సర్కార్ ఉన్నా సింగరేణి ప్రైవేట్ పరమవుతుందన్నారు. కార్మికులకు కారుణ్య ఉద్యోగాలను కల్పించింది కేసీఆరేనన్నారు. కోలిండియాలో లేని అనేక హక్కులను కార్మికులకు కల్పించారన్నారు. పెర్క్స్పై పడే ఆదాయ పన్నులను ప్రభుత్వమే చెల్లిస్తున్నదని కేసీఆర్ మందమర్రి సభలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మరోసారి బెల్లంపల్లిలో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఉంటున్న అపర కుబేరుడితో తాను తలపడుతున్నాని, పేదింటి బిడ్డనైనా తనను మూడవసారి ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికల సమయంలో వారి స్వార్థానికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారే తప్పా కార్మికులపై సంక్షేమంపై వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఊసరవెల్లి సిగ్గుపడే విధంగా పూటకో పార్టీ మారుతున్నారని గడ్డం బ్రదర్స్ను ఉద్ధేశించి మాట్లాడారు. నా కుటుంబంతో సహా ఇక్కడే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న తనను మరోసారి ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సింగరేణి కార్మికులకు అన్ని విధాలా హక్కులు, సౌకర్యాలు కల్పిస్తున్న కేసీఆర్కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ పిలుపునిచ్చారు. కార్మికులకు వడ్డీలేకుండా రూ. 10 లక్షల గృహ రుణాలు చెల్లించినట్లు తెలిపారు. రుణాలతో ఏడాదికి రూ. 50వేల లాభం చేకూరుతుందన్నారు. గత గుర్తింపు సంఘాలు నామమాత్రంగా పెంచుతూ వస్తున్న లాభాల వాటాను కార్మికులకు 16 శాతం నుంచి 32 శాతానికి పెంచిందని వివరించారు. సింగరేణిలో సకల జనుల సమ్మెతోనే తెలంగాణ తెచ్చుకున్నాము, సాధించిన తెలంగాణను కాపాడుకునేందుకు మూడవసారి కేసీఆర్ సీఎం కావాల్సిన అవసరముందన్నారు. సింగరేణి కార్మికుల హక్కులు సాధించాలంటే, భవిష్యత్లో కారుణ్య నియామకాలు పోకుం డా ఉండాలంటే దుర్గం చిన్నయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 11 నియోజకవర్గాల్లోని సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, కేంద్రకమిటీ సభ్యులు గెల్లి రాజలింగు, బడికెల సంపత్, ఏరియా నాయకులు వెంకటరమణ, రాజనాల రమేశ్, సిద్ధంశెట్టి సాజన్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రెబ్బెన, నవంబర్ 21:రెబ్బెన మండలం లోని కార్మిక క్షేత్రం గోలేటిటౌన్షిప్లో మంగళవారం రాత్రి టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేశారు. గోలేటిటౌన్షిప్ లోని తెలంగాణ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించి కార్మిక వాడల్లో ఇంటింటికి వెళ్లి ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి ని భారీ మోజార్టీ తో గెలిపించాలని కొరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.