విద్యార్థులకు అండగా ఎస్టీ, ఎస్సీ, బీసీ వెల్ఫేర్శాఖలు
హాస్టళ్లలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
పక్కాగా మెనూ అమలు
స్టూడెంట్స్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
వచ్చే నెల 1 వరకు గృహాల్లో చేరేందుకు అవకాశం
పేద, మధ్యతరగతి వర్గాలకు వరం వసతి గృహాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో చదువుకోవడానికి వసతి గృహాలు ఎంతో అనుకూలం.గతంలో హాస్టల్స్లో సీట్ల భర్తీకి అధికారులు ఇబ్బంది పడేవారు. తల్లిదండ్రులను ఒప్పించేందుకు నానా తంటాలు పడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ నెల 2 నుంచి చేపట్టిన బడిబాటతో ప్రభుత్వ బడుల్లోనూ ఈసారి విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. గడిచిన రెండు సంవత్సరాల్లో కరోనా కారణంగా వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గినప్పటికీ ఈసారి అమాంతం పెరిగింది. వసతి గృహాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం, పౌష్టికాహారం అందించడంతో విద్యార్థులు హాస్టల్స్లో చేరడానికి ఆసక్తి కనబరుస్తు న్నారు. వచ్చే నెల 1 వరకు హాస్టళ్లలో చేరడానికి అవకాశం ఉన్నదని, విద్యార్థులను వెంటనే చేర్చాలని విద్యాశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఖమ్మం, జూన్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పేద, మధ్యతరగతి వర్గాలకు వరం వసతి గృహాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో చదువుకోవడానికి వసతి గృహాలు ఎంతో అనుకూలం.గతంలో హాస్టల్స్లో సీట్ల భర్తీకి అధికారులు ఇబ్బంది పడేవారు. తల్లిదండ్రులను ఒప్పించేందుకు నానా తంటాలు పడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ నెల 2 నుంచి చేపట్టిన బడిబాటతో ప్రభుత్వ బడుల్లోనూ ఈసారి విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. గడిచిన రెండు సంవత్సరాల్లో కరోనా కారణంగా వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గినప్పటికీ ఈసారి అమాంతం పెరిగింది. వసతి గృహాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం, పౌష్టికాహారం అందించడంతో విద్యార్థులు హాస్టల్స్లో చేరడానికి ఆసక్తికనబరుస్తున్నారు. వచ్చే నెల 1 వరకు హాస్టళ్లలో చేరడానికి అవకాశం ఉన్నదని, విద్యార్థులను వెంటనే చేర్చాలని విద్యాశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పక్కాగా మెనూ అమలు..
ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు విద్యార్థులకు వరంగా మారాయి. ఈ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల కోసం అధికారులు పక్కాగా మెనూ పాటిస్తున్నారు. ప్రభుత్వం పోషకాహారం కోసం గతంలో కంటే ఎక్కువ నిధులు విడుదల చేస్తున్నది. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందుతున్నది. ఆదివారం ప్రత్యేకంగా నాన్వెజ్ మెనూ పాటిస్తున్నారు.
విద్యాలయాలు కళకళ..
వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసింది. పాఠశాల స్థాయి విద్యార్థులకే కాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీతో పాటు ఇతర కోర్సులు చదువుతున్న వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల ఆధ్వర్యంలో వసతి గృహాలు నడుస్తున్నాయి. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఫార్మసీ, నర్సింగ్ విద్యార్థుల కోసం వసృతి గృహాల్లోని లైబ్రరీల్లో అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి. అవసరం మేరకు అధ్యాపకులతో ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయి. అధ్యాపకులు అప్పటికప్పుడు విద్యార్థుల సందేహాలను తీరుస్తున్నారు.
కలెక్టర్ ప్రత్యేక దృష్టి..
వసతి గృహాల్లో గతేడాది కంటే ఈసారి విద్యార్థుల సంఖ్య రెట్టింపు అవుతుందని విద్యాశాఖ అంచనా వేస్తున్నది. ఈ ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగనుండడంతో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగనున్నది. కలెక్టర్ వీపీ గౌతమ్ ప్రత్యేక దృష్టి సారించి స్వయంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించారు. విద్యార్థుల చేరికపై ఉపాధ్యాయులు, అధికారులను ఆరా తీశారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. వసతి గృహాల్లో వారికి అందుతున్న వసతుల గురించి వివరించారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్ గౌతమ్ (ఫైల్)
విద్యార్థులకు మెరుగైన వసతులు..
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ఉంటున్న పాఠశాల, కళాశాల విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నాం. మెనూ ప్రకారం వారికి భోజనం అందిస్తాం. గ్రామాల్లో ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించడంతో ఈసారి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. – ఎస్సీ అభివృద్ధిశాఖ జిల్లా డీడీ కస్తాల సత్యనారాయణ