లక్ష్మీదేవిపల్లి, ఆగస్టు 23: అనేక పథకాలు అమలు చేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అదే లక్ష్యంతో అందరమూ కలిసి సమష్టిగా పనిచేస్తామని అన్నారు. మండలంలోని శ్రీనగర్కాలనీలో ఉన్న కోనేరు సత్యనారాయణ (చిన్ని)ని ప్రభుత్వ విప్ రేగా బుధవారం ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్లోకి చేరుతున్నట్లు తెలుసుకున్న ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోనేరు చిన్నికి పరిచయాలు ఉన్నాయని, ఆయనకు అభిమానాలు కూడా చాలా మందే ఉన్నారని అన్నారు. ఆయన బీఆర్ఎస్లోకి రావడాన్ని తామంతా స్వాగతిస్తున్నామని అన్నారు. కోనేరు చిన్ని తండ్రి నుంచి అతడి కుటుంబంతో అనుబంధం ఉన్న వారంతా కోనేరు వెంటే నడుస్తున్నారని అన్నారు. కోనేరు సత్యనారాయణ (చిన్ని), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఎండీ యూసుఫ్, చందు తదితరులు పాల్గొన్నారు.