ఖమ్మం, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి గౌరవ వేతనాన్ని మూడింతలు చేసింది. ప్రస్తుతం నెలకు రూ.1,000 చొప్పున అందిస్తుండగా.. దాన్ని రూ.3 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఖమ్మం జిల్లాలోని 2,275 మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులకు లబ్ధిచేకూరనున్నది. ఈ లెక్కన ఖమ్మం జిల్లాకు నెలకు రూ.54.60 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నది. కాగా, కేంద్రం కూడా తన వాటాను పెంచాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి.
మధ్యాహ్న భోజన నిర్వాహకుల గౌరవ వేతనం మూడింతలైంది. ప్రస్తుతం నెలకు రూ.1,000 చొప్పున అందిస్తున్న వేతనాన్ని రూ.3 వేలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఇస్తున్న రూ.వెయ్యిలో 60 శాతం (రూ.600) కేంద్ర ప్రభుత్వం, 40 శాతం (రూ.400) రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. ప్రస్తుతం పెంచిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుండడంతో రాష్ట ప్రభుత్వ వాటా 80 శాతానికి (రూ.2400) చేరనున్నది. ప్రభుత్వ నిర్ణయంతో ఖమ్మం జిల్లాలోని 2,275 మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులకు లబ్ధిచేకూరనున్నది. ఈ లెక్కన ఖమ్మం జిల్లాకు నెలకు రూ.54.60 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం అందిచనున్నది. బీఆర్ఎస్ సర్కారు నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే కేంద్రం కూడా తన వాటాను పెంచాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులు డిమాండ్ చేస్తునారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వ తీపికబురు అందించింది. వారికి అందించే గౌరవ వేతనాన్ని మూడు రెట్లు పెంచింది. ఇప్పటి వరకు అందిస్తున్న రూ.1,000కు అదనంగా మరో రూ.2,000 కలిపింది. ఆ మొత్తం రూ.3,000ను త్వరలోనే అందించనున్నది. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు గౌరవ వేతనం పెంచుతామని గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం విదితమే. ఈ హామీ మేరకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ వేతనం పెంపు జీవో ఆర్డర్ కాపీని ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇచ్చిన మాట ప్రకారం గౌరవ వేతనాలు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గౌరవ వేతనం సరిపోవడం లేదని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు కోరగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను 80 శాతానికి (రూ.2400) పెంచి వారి విజ్ఞప్తిని మన్నించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే.
కేంద్రం వాటా ఆరు వందలే..
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన పథకంలో కుక్ కమ్ హెల్పర్లకు రూ.1,000 మాత్రమే గౌరవ వేతనం చెల్లించేవారు. వాటిల్లో 60 శాతం (రూ.600) కేంద్రం, 40 శాతం (రూ.400) రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ వస్తున్నది. తాజాగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా 2,275 మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులకు లబ్ధి చేకూరనున్నది. రాష్ర్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్రం తన వాటాను మరింతగా పెంచాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి..
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2,275 మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులకు లబ్ధి చేకూరుతుంది. పెంచిన వేతనంతో మధ్యాహ్న భోజన కార్మికులకు లబ్ధి చేకూరనున్నది. గతంలో ఇచ్చే రూ.1,000 వేతనానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,000 పెంచి ఇక రూ.3,000 అందించనున్నది. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
–సోమశేఖరశర్మ, డీఈవో, ఖమ్మం
సీఎం కేపీఆర్ సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు..
మధ్యాహ్న భోజన కార్మికులకు అందిస్తున్న గౌరవ వేతనం పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు మా కార్మికులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గతంలో రూ.వెయ్యి మాత్రమే గౌరవ వేతనం ఇచ్చేవారు. కుటుంబాన్ని గడుపుకోవడానికి అవి ఏ మాత్రమూ సరిపోయేవి కావు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు ఇప్పుడు ఇచ్చే రూ.3,000 గౌరవ వేతనంతో మా కుటుంబానికి ఆర్థిక సహకారం అందించినట్లవుతుంది.
–అద్దంకి డిపోర, మధ్యాహ్న భోజన కార్మికురాలు
మూడింతలు వేతనం పెంచడం గొప్ప నిర్ణయం..
మధ్యాహ్న భోజన కార్మికులకు అందించే గౌరవ వేతనాలు మూడింతలు పెంచడం గొప్ప నిర్ణయం. దీనిని మేమంతా ఎంతో గౌరవంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో లక్షలాది మధ్యాహ్న భోజన నిర్వాహకుల కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలవనున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
–తలారి లక్ష్మీనారాయణ, చింతకాని మధ్యాహ్న నిర్వాహకులు