ఖమ్మం : వీవీసీ ట్రస్ట్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ పోలీసుశాఖకు వితరణగా మినీ ట్రాక్టర్ను అందజేశారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ విష్ణు ఎస్ వారియర్ను కలిసి ఈ ట్రాక్టర్ ను అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు నెలలో ఖమ్మం కమిషనరేట్ కార్యాలయ ఆవరణలోని 10 ఎకరాల్లో సుమారు మూడు వేల పండ్ల మొక్కలను వాటి సంరక్షిస్తున్నామన్నారు.
నీటిని వృథా చేయకుండా రూ. లక్ష ఖర్చుతో బిందు సేద్యం ద్వారా వాటికి నీరందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆ భూమిలో అంజీర, జామ, పనస, మామిడి, ఉసిరి, బత్తాయి, సీతాఫలం, తదితర పండ్ల మొక్కలు నాటమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా అండ్ అర్డర్ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ అంజనేయులు, రామోజీ రమేష్, భస్వారెడ్డి, సీఐలు పాల్గొన్నారు.