సత్తుపల్లి : నేటి యువత స్వామి వివేకానంద స్పూర్తితో ముందుకుసాగాలని మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. బుధవారం వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకుని పట్టణ శివారులోని జేవీఆర్ పార్కు వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివేకానంద చూపిన మార్గంలో యువత నడవాలని ఆకాంక్షించారు. సామాజిక సేవల్లో పాలుపంచుకుంటున్న పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ సుజాత, పలు స్వచ్ఛంద సంస్థల బాధ్యులు అజార్, రాజు, ప్రవీణ్కుమార్, రాధాకృష్ణ, నిహాల్, చిత్తలూరి ప్రసాద్, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, దారా ఏసురత్నం, గాదె నర్సింహారావు, చల్లగుండ్ల అప్పారావు, భాషావలీ, ప్రకాష్రావు తదితరులు పాల్గొన్నారు.