ప్రతి గ్రామానికీ డంపింగ్ యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం
పారిశుధ్యానికి ప్రాధాన్యం.. సీజనల్ వ్యాధులు దూరం
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
వేపకుంట్లలో పల్లె ప్రగతి ముగింపు సభ
‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని చెరువుకొమ్ముతండా, వేపకుంట్ల గ్రామాల్లో శనివారం చివరిరోజు నిర్వహించిన పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ‘మిషన్ భగీరథ’తో ప్రజల తాగునీటి కష్టాలు తీరాయన్నారు. మహిళలు బిందెలు పట్టుకుని రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేకపోయిందన్నారు. పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని నమ్మిన సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా పల్లె ప్రగతిని అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామా ల్లో సీజనల్ వ్యాధులు దూరమయ్యాయన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి ఊరిలో డంపింగ్ యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, నర్సరీ ఏర్పాటయ్యాయన్నారు. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ ట్య్రాంకర్, ట్రాలీ సమకూరిందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ బచ్చు విజయ్కుమార్ పాల్గొన్నారు.
రఘునాథపాలెం, జూన్ 18: ‘పల్లె ప్రగతి’ ద్వారా ఐదు విడతలుగా జరిగిన పనులతో రాష్ట్రంలోని పల్లెలన్నీ మురిసిపోయాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని చెరువుకొమ్ముతండా, వేపకుంట్ల గ్రామాల్లో చివరిరోజు పల్లెప్రగతి కార్యక్రమాలు జరిగాయి. వేపకుంట్ల గ్రామంలో మాజీ జడ్పీటీసీ కుర్రా భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో మంత్రి మాట్లాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని పనులు కేసీఆర్ చేసినట్లు గుర్తుచేశారు.‘మిషన్ భగీరథ’ పనులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. రూ.40 వేల కోట్లతో కృష్ణా నది నీటిని ఫిల్టర్ చేసి ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధ జలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. ఫలితంగా పల్లెల్లో మహిళలు బిందెలు పట్టుకొని నల్లాల దగ్గర ఘర్షణలు పడే సంఘటనలు ఇప్పుడు ఎక్కడా కన్పించడం లేదని అన్నారు. పల్లెప్రగతి భాగంగా ప్రతి పల్లెలో పచ్చదనంతో వెల్లివిరిసిందని అన్నారు. పల్లెప్రగతి నిర్వహణ ద్వారా నాలుగేళ్లుగా రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల జాడే లేకుండా పోయిందన్నారు. అత్యధికంగా డెంగీ కేసులు నమోదయ్యే ఖమ్మం జిల్లాలో ఇప్పుడవి పూర్తిగా తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రతి ఊర్లో డంపింగ్యార్డు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, నర్సరీ వంటివి వాటిని ఏర్పాటు చేయడంతో నేడు పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో పరిఢవిల్లుతున్నాని గుర్తుచేశారు.
భూములను నమ్ముకోండి..
తెలంగాణ సర్కార్ ఊరురా చేస్తున్న అభివృద్ధితో భూముల ధరలకు రెక్కలొచ్చాయన్నారు. భూములను ఏమాత్రం అమ్ముకోవద్దని, నమ్ముకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ఖాళీ జాగ కలిగిన ప్రతి నిరుపేద సొంత ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనుందని అన్నారు. అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అజ్మీరా వీరూనాయక్, దారా శ్యాం, బానోతు మంగమ్మ, ఉప్పెర్ల వనజారాణి, పొట్లపల్లి రాజా, బండి నాగేశ్వరరావు, ఉప్పెర్ల కొండల్రావు, కూరాకుల నాగేశ్వరరావు, రామస్వామి, బానోతు దేవేందర్, పిన్ని కోటేశ్వరరావు, మందడపు సుధాకర్, బోయినపల్లి లక్ష్మణ్గౌడ్, యాసా రామారావు, యాసా నీలిమ, ఆంగోతు రామస్వామి, తొలుపునూరి దానయ్య, కుతుంబాక నరేశ్, అధికారులు పాల్గొన్నారు.