నేలకొండపల్లి :భైరవునిపల్లి గ్రామంలో రైతులు తమ పొలాలకు వెళ్లడానికి ఇబ్బందికలుగుతోంది. ఈ సమస్య ను పరిష్కరించేందుకు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి ముందుకువచ్చారు. డొంక రోడ్లను బాగు చేయడానికి ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో జేసీబీని పంపించి బాగుచేశారు. ఈ సందర్భంగా రైతులు, గ్రామస్తులు ఎమ్మెల్యే కందాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మరికంటి రేణుబాబు, మరికంటి రమేష్, కనకబండి కనకరాజు,కె .మధసుదనరావు, పెద్దపాక వెంకటేశ్వర్లు, బొల్లం సత్యనారాయణ, పెద్దపాక సత్యం, మల్లెబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు.